మిషన్ భగీరథ ఎయిర్ వాల్వ్​ను ఢీకొని యువకుడు మృతి

by Disha Web Desk 15 |
మిషన్ భగీరథ ఎయిర్ వాల్వ్​ను ఢీకొని యువకుడు మృతి
X

దిశ,మరికల్ : మండల కేంద్రానికి చెందిన బండ్రవల్లి మహేష్ మంగళవారం మిషన్ భగీరథ ఏర్ వాల్వ్​ను ఢీకొని మృతి చెందాడు. వివరాల్లోకెళ్తే మహేష్ ప్రైవేట్ ఉద్యోగ విధులను ముగించుకొని తన స్వగృహానికి ద్విచక్ర వాహనంపై వెళుతుండగా నారాయణపేట రోడ్ లోని మైనార్టీ శ్మశాన వాటిక దగ్గర రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ మెగా హెయిర్ వాల్వ్​ను ఢీకొనడంతో తలకు తీవ్ర గాయాలై రక్తస్రావం కావడంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై అశోక్ బాబు తెలిపారు.



Next Story