అడ్డాకులలో వోల్వో బస్సు బోల్తా.. తృటిలో తప్పిన పెను ప్రమాదం

by Disha Web Desk 19 |
అడ్డాకులలో వోల్వో బస్సు బోల్తా.. తృటిలో తప్పిన పెను ప్రమాదం
X

దిశ, అడ్డాకుల: అడ్డాకుల మండలంలోని స్నేహ కంపెనీ దగ్గర ప్రైవేట్ ట్రావెల్స్ వోల్వో బస్సు తెల్లవారుజామున బోల్తా పడింది. కాగా, బెంగళూరు నుండి హైదరాబాదుకు 17 మంది ప్రయాణికులతో వెళ్తున్న క్రమంలో స్నేహ కంపెనీ క్రాసింగ్ దగ్గర లారీ అడ్డు రావడంతో దానిని తప్పించబోయి బస్సు బోల్తా పడినట్లు డ్రైవర్ రత్నం తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని అంబులెన్స్‌లో జిల్లా ఆసుపత్రికి తరలించారు. మిగతా వారందరూ సురక్షితంగా బయటపడ్డారని, ఆ కంపెనీకి చెందిన మరో బస్సులో ప్రయాణికులను పంపించినట్లు పోలీసులు తెలిపారు.

Next Story

Most Viewed