పండుగకు వచ్చి ప్రాణాలు పోగొట్టుకున్న యువకులు

by Disha Web Desk 11 |
పండుగకు వచ్చి ప్రాణాలు పోగొట్టుకున్న యువకులు
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: జిల్లా కేంద్రంలోని రేగడిగడ్డ తండా వద్ద మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. వివరాలలోకి వెళితే కోయిలకొండ మండలం రాజు నాయక్ తండా పరిధిలోని పెద్ద తండా కు చెందిన విస్లావత్ ప్రకాష్ (24), ముడావత్ వెంకటేష్ (23)లు పూణే వలస వెళ్లి పెయింటర్, మేస్త్రీ పనులు చేసుకొని జీవనం సాగిస్తున్నారు. తమ తండాలో పోచమ్మ పండగ చేస్తున్న క్రమంలో మంగళవారం ఉదయం గ్రామానికి చేరుకున్నారు. పూజకు అవసరమైన సామాగ్రి కొనుగోలు, తదితర పనులు ముగించుకొని తిరిగి తమ సొంత గ్రామానికి బైక్ పై వెళుతుండగా వేగంగా వచ్చిన ట్రాలీ లారీ వీరి బైక్ ను ఢీకొట్టింది. ఈ సంఘటనలో లారీ టైర్లు యువకులపై నుంచి వెళ్లడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించారు. పోచమ్మ పండగ వేడుకలతో ఆనందంగా గడపాల్సిన రాజు నాయక్ తండాలో విషాద వాతావరణం నెలకొంది. మహబూబ్ నగర్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Next Story

Most Viewed