- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
మోడీ హయంలో దేశంలో బాగుపడ్డ ఏకైక వ్యక్తి ఆయనే: బీజేపీపై KTR ఫైర్
దిశ, వెబ్డెస్క్: రానున్న రోజుల్లో పాడి కౌశిక్ రెడ్డి నాయకత్వంలో హుజురాబాద్ ప్రాంతంలో ఎగిరేది బీఆర్ఎస్ జెండా అని మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం జమ్మికుంటలో జరిగిన భారీ బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ పాల్గొ్న్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంవత్సరం తర్వత హుజురాబాద్ గడ్డపై గులాబీ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ప్రధాని మోడీ హయంలో దేశంలో బాగుపడ్డ ఓకే ఒక్క వ్యక్తి అదానీ అని ఆరోపించారు. రైతుల ఆదాయం డబుల్ చేస్తా, కరెంట్ లేని గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని.. 2023 కల్ల భారత దేశాన్ని భుతల స్వర్గం చేస్తా అన్నారు చేశారా? అని ప్రశ్నించారు. దేశంలో అన్ని రకాల నిత్యవసర వస్తువుల ధరలను, పెట్రోల్, డీజిల్ ధరలను పెంచింది మోడీ ప్రభుత్వం కాదా అని నిలదీశారు. 30 లక్షల కోట్లు వసూల్ చేసి పెద్దలకు పంచారని తీవ్ర ఆరోపణలు చేశారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం పేదలను కొట్టి పెద్దలకు పెట్టే ప్రభుత్వమని ఫైరయ్యారు.