బ్రేకింగ్: బీజేపీని వీడటంపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక ప్రకటన

by Disha Web Desk 19 |
బ్రేకింగ్: బీజేపీని వీడటంపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక ప్రకటన
X

దిశ, తెలంగాణ బ్యూరో: తాను బీజేపీని వీడుతున్నట్లు సోషల్ మీడియాల్లో వస్తున్న వార్తలు నమ్మొద్దని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. బీజేపీతోనే తన ప్రయాణం కొనసాగుతుందని గురువారం ఓ ప్రకటనలో క్లారిటీ ఇచ్చారు. వ్యక్తిగత స్వార్థం కోసం సిద్ధాంతాలను మార్చే వ్యక్తిని తాను కాదని నొక్కి చెప్పారు. సమాజ హితం కోసం కృషి చేసే వ్యక్తినని అభిప్రాయన్ని వ్యక్తం చేశారు. ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేగా పనిచేసిన సందర్భాల్లో ఎక్కడా అవినీతి, వ్యక్తిగత స్వార్ధం లేకుండా నీతి నిజాయితీగా పనిచేశానని గుర్తు చేసుకున్నారు.

ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు కోసం గతంలో ఎంపీ పదవికి రాజీనామా చేసి స్వరాష్ట్ర సాధనలో తన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించానని చెప్పారు. కానీ తెలంగాణ ఆకాంక్షలపై కేసీఆర్ నీళ్లు చల్లాడని ఆరోపించారు. అందుకే కేసీఆర్‌పై బీజేపీ పోరాటం చేస్తూనే ఉన్నదన్నారు. ప్రజాస్వామిక, బహుజన తెలంగాణా ఏర్పాటు చేసే సత్తా బీజేపీకి మాత్రమే ఉన్నదన్నారు. బీజేపీని తనతో పాటు ఇతర కీలక నాయకులెవ్వరూ వీడటం లేదని వెల్లడించారు.

Next Story