తారా స్థాయికి చేరిన మాటల యుద్ధం.. కేటీఆర్‌కు రాజగోపాల్ రెడ్డి సవాల్

by Disha Web Desk 2 |
తారా స్థాయికి చేరిన మాటల యుద్ధం.. కేటీఆర్‌కు రాజగోపాల్ రెడ్డి సవాల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: మునుగోడులో అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య పొలిటికల్ వార్ హీటెక్కింది. మంత్రి కేటీఆర్‌పై రాజగోపాల్ రెడ్డి ఫైర్ అయ్యారు. తాను కాంట్రాక్టుల కోసం బీజేపీకి అమ్ముడు పోయానని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంగళవారం ట్విట్టర్ వేదికగా స్పందించిన రాజగోపాల్ రెడ్డి.. తాను బీజేపీకి అమ్ముడు పోలేదని అన్నారు. యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహ స్వామి సాక్షిగా నేను స్నానం చేసి తడిబట్టలతో ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని కేసీఆర్, కేటీఆర్ తడి బట్టలతో వచ్చి ప్రమాణం చేయడానికి సిద్ధమా అని సవాల్ విసిరారు. అంతకు ముందు రాజగోపాల్ రెడ్డిని ఉద్దేశించి మంత్రి కేటీఆర్ ఘాటు విమర్శలు చేశారు. మునుగోడు నియోజకవర్గ ప్రజల ఆత్మగౌరవానికి బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అహంకారానికి మధ్య జరుగుతున్నదే ఈ ఉప ఎన్నిక అన్నారు. కాంట్రాక్టులతో అక్రమంగా డబ్బు సంపాదించి ఆ ధనంతో ఇన్నాళ్లుగా నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. ఆయనో ఓ ఫెయిల్యూర్ ఎమ్మెల్యే అని, వ్యక్తిగత స్వార్థం కోసం ఇప్పుడు ఉప ఎన్నిక తీసుకొచ్చారని మండిపడ్డారు. కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన రాజగోపాల్ రెడ్డి యాదగిరిగుట్టలో తడిబట్టలతో ప్రమాణానికి సిద్ధమా అని ఛాలెంజ్ చేశారు.



Next Story

Most Viewed