కాంగ్రెస్ పార్టీది నమ్మక ద్రోహం: కిషన్ రెడ్డి

by Disha Web Desk 13 |
కాంగ్రెస్ పార్టీది నమ్మక ద్రోహం: కిషన్ రెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో:కేసీఆర్ కుటుంబం తెలంగాణను దోచుకుంటే హామీల పేరుతో కాంగ్రెస్ పార్టీ నమ్మకద్రోహం చేసిందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పోయిందని కేసీఆర్ ఇక మళ్లీ అధికారంలోకి రాలేడన్నారు. అధికారంలో ఉండగా కేసీఆర్ కుటుంబ సభ్యులు వందల ఎకరాల భూములు ఏరకంగా కబ్జాలు చేశారో మనందరికి తెలుసన్నారు. వంద రోజుల్లో రేషన్ కార్డు, పింఛన్లు, మహిళలకు నెలకు రూ.2500 ఆర్థిక సహాయం వంటి అనేక హామీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను వెన్నుపోటు పొడిచిందని ధ్వజమెత్తారు. దేశంలో అనేక సమస్యలను మోడీ పరిష్కరించారని అందుకే నరేంద్ర మోడీ నాయకత్వం దేశానికి, దేశ భవిష్యత్ కు అవసరం అన్నారు. మోడీ లేని భారతదేశాన్ని ఊహించుకోలేమన్నారు.

Next Story

Most Viewed