సింగరేణి జీపీ నిధులపై జెడ్పీసీఈఓ విచారణ

by Sridhar Babu |
సింగరేణి జీపీ నిధులపై జెడ్పీసీఈఓ విచారణ
X

దిశ, కారేపల్లి : సింగరేణి గ్రామపంచాయతీలో నిధుల వ్యవహారంపై విచారణ సాగుతూనే ఉంది. జీపీలో నిధులు దుర్వినియోగ ఆరోపణలపై ఖమ్మం జెడ్పీ సీఈవో వింజం అప్పారావు మంగళవారం క్షేత్రస్ధాయిలో పరిశీలన చేశారు. పంచాయతీలో నిధులు దుర్వినియోగం అయ్యాయని వార్డు సభ్యులు హెచ్‌ఆర్సీని ఆశ్రయించారు. దానిపై సమగ్ర విచారణ చేయాలని జిల్లా అధికారులను హెచ్‌ఆర్సీ ఆదేశించింది. దానిలో భాగంగా సీఈవో సింగరేణి మండలంలో చేపట్టిన 8 రకాల పనులపై విచారణ చేపట్టారు. చేసిన పనుల వద్దకు వెళ్లి సీఈవో విచారణచేస్తున్నారు.

గాంధీ బొమ్మ వద్ద వార్డు సభ్యుల ధర్నా

హెచ్‌ఆర్సీ ఆదేశాల మేరకు జెడ్పీసీఈవో క్షేత్రస్ధాయిలో సరిగా విచారణ చేయటంలేదని ఆరోపిస్తూ సింగరేణి గ్రామపంచాయతీ వార్డు సభ్యులు బస్టాండ్‌ సెంటర్‌లోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. వీరి అందోళనకు ఎంపీటీసీ జడల వసంత సంఫీుభావం ప్రకటించారు. మూడేండ్లు గడుస్తున్నా సమస్యకు పరిష్కారం చూపటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల తీరుతో పంచాయతీ అభివృద్ధి కుంటుపడుతుందని ఆరోపించారు. జెడ్పీసీఈవో విచారణపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు వార్డు సభ్యులు ఎస్‌కె.గౌసుద్దీన్‌, గంగరబోయిన సత్యనారాయణ, పాలిక రమేష్‌, రోహిత, నస్రీన్‌, బట్టు సుజాత, బి.నాగమణి తెలిపారు.



Next Story

Most Viewed