- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
గడపగడపకు వైయస్సార్ కార్యక్రమాన్ని ప్రారంభించిన కవిత

దిశ, గుండాల : రాజన్న బిడ్డగా తెలంగాణ రాష్ట్రంలో విశేష ప్రజాదరణ పొందుతున్న షర్మిల అక్క నాయకత్వంలోని వైఎస్ ఆర్సీపీ పార్టీని ప్రజలు ఆదరించాలని వైయస్సార్ తెలంగాణ పార్టీ ఖమ్మం కొత్తగూడెం జిల్లాల కోఆర్డినేటర్ గడిపల్లి కవిత అన్నారు. శనివారం గుండాల మండల కేంద్రంలో రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడుతూ.. పేదవాడి ఆశల కనుగుణంగా రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలో అనేక సంక్షేమ పథకాలు ప్రజల ముందుకు తీసుకెళ్లిన ఘనత రాజశేఖర్ రెడ్డి గారిదన్నారు. ఆమె తనయురాలు షర్మిలమ్మ నిరుపేద ప్రజలకు అండగా నిలుస్తూ సంక్షేమ ఫలాలను పేదలకు అందించాలని దృక్పథంతో వైఎస్సార్ పార్టీని ఏర్పాటు చేశారని తెలిపారు.
రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను విస్మరించి ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్నారని అన్నారు. షర్మిల అక్క నాయకత్వంలో గత మూడు నెలలుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 755 కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేశారన్నారు. ఆమె పాదయాత్రకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విశేష ప్రజాధరణ లభించిందని, రానున్న రోజుల్లో వైఎస్ఆర్ సీపీని ప్రజలు బలపరచాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండ కట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు సోయం వీరభద్రం, వైయస్సార్ తెలంగాణ నాయకులు, కంది వెంకటరెడ్డి, ఉప్పల్ రెడ్డి, టి. రాంబాబు తదితరులు పాల్గొన్నారు.