కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై షర్మిల ఫైర్.. రోజులు దగ్గర పడ్డాయంటూ..

by Javid Pasha |
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై షర్మిల ఫైర్.. రోజులు దగ్గర పడ్డాయంటూ..
X

దిశ దమ్మపేట: కాలేజీలకు వెళ్లడానికి కనీసం బస్సు సౌకర్యం కూడా కల్పించలేని ఎమ్మెల్యే ఎందుకని వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల దమ్మపేట బహిరంగ సభలో అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో షర్మిల పాదయాత్ర రెండో రోజూ కొనసాగింది, చిల్లగుంపు నుండి దమ్మపేట వరకు సాగిన పాదయాత్రలో దమ్మపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో షర్మిల మాట్లాడుతూ.. ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఒక పార్టీలో గెలిచి టీఆర్ఎస్ పార్టీ సంకనెక్కాడని, కనీసం కాలేజీకి వెళ్లడానికి బస్సు సౌకర్యం కూడా కల్పించిన ఎమ్మెల్యే ఎందుకని ప్రశ్నించారు. ప్రజలు రాళ్లతో కొట్టి నిలదీసి అడిగే రోజులు దగ్గరపడ్డాయని, ఎమ్మెల్యే ఇసుక దందా చేసి గెస్ట్ హౌస్‌లు కట్టుకొని భోగాలు అనుభవిస్తున్నాడని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్ధరించేది ఏమీ లేదని, 16 మంది క్యాబినెట్‌లో ఉంటే పది మందిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని, కేసీఆర్‌ను మించిన ధనవంతుపు రాజకీయ నాయకులు దేశంలో ఎక్కడా లేడని అన్నారు.

బీజేపీ నాయకులు కేసీఆర్ అవినీతి చిట్టా తమ దగ్గర ఉందని, కేసీఆర్ ను జైల్లో పెడతాం ,ఆధారాలు బయటపెడతానని చెప్పనా, అవినీతిపై ఆధారాలు ఉంటే ఎందుకు జైల్లో పెట్టారని, కెసిఆర్‌తో బీజేపీకి ఏమైనా ఒప్పందంకుదిరిందా అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పోలీసు ఉద్యోగులు తప్ప ఏ విభాగాల్లో నోటిఫికేషన్ విడుదల చేయడం లేదని, టీఆర్ఎస్ నేతల రక్షణ కోసం పోలీస్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారని విమర్శించారు. ఆదివారం రాత్రి దమ్మపేట మండలంలో కురిసిన అకాల వర్షాలకు రైతులు పంట తీవ్రంగా నష్టపోయారని, రైతులను ఆదుకునే నాయకుడు లేడని అన్నారు.


ధరణి పేరు చెప్పి అంతా అవినీతి మయం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ ప్రక్షాళన పేరుతో ధరణి వెబ్సైట్ తీసుకువచ్చి అంతా అవినీతి మయం చేశారని ఆరోపించారు. నాలుగు ఎకరాలు ఉన్న రైతులకు రెండు ఎకరాలు, ఎకరం ఉన్న రైతుకు భూమి లేనట్లుగా ధరణిలో చూపిస్తుందని, కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఉసిపోయినట్లుగా ధరణి వెబ్సైట్ పరిస్థితి తయారయిందన్నారు. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం దొరకాలంటే రాబోయే ఎన్నికల్లో ప్రజలంతా వైయస్సార్ తెలంగాణ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో వాడుక రాజగోపాల్, సోయం వీరభద్రం, పెనుబల్లి రమేష్, పెట్టా రామైరెడ్డి, నీలం రమేష్ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed