సాగర్ కాలువలో యువకుడు గల్లంతు

by Sridhar Babu |
సాగర్ కాలువలో యువకుడు గల్లంతు
X

దిశ, ఖమ్మం రూరల్ : సాగర్ కాలువలో పడి యువకుడు గల్లంతయ్యాడు. ఖమ్మం పట్టణం ఎన్ఎస్ టీ రోడ్డుకు చెందిన ముద్దంగుల మణికుమార్ (30) ఉదయం 6 గంటలకు పనులు నిమిత్తం పెయింటింగ్ పనికి వెళ్లాడు. తిరిగి వస్తూ పల్లెగూడెం రెవెన్యూ పరిధిలో గల లాకల్ వద్ద బహిర్భూభూమికి వెళ్లే క్రమంలో ప్రమాదవశాత్తు ఎడమ కాలువలో పడి గల్లంతయ్యాడు. గల్లంతైన వ్యక్తి అవివాహితుడు. సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.



Next Story

Most Viewed