- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
డెంగ్యూతో యువకుడు మృతి
by S Gopi |

X
దిశ, దుమ్ముగూడెం: మండల పరిధిలోని తూరుబాక గ్రామానికి చెందిన యువకుడు కొంగూరి రిషి(18) మంగళవారం ఖమ్మంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో డెంగ్యూతో మృతి చెందాడు. మృతుడు రిషిని గతవారం భద్రాచలంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో కుటుంబ సభ్యులు చేర్పించారు. అక్కడ రక్త పరీక్షలలో డెంగ్యూ వ్యాధి నిర్ధారణ కావడంతో చికిత్స పొందుతున్న క్రమంలో ఆరోగ్యం మరింత క్షీణించటంతో మెరుగైన వైద్యం కోసం ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో అనారోగ్యం తీవ్రమై మంగళవారం మృతిచెందాడు. కొడుకు పై ఆశలు పెట్టుకున్న కుటుంబం రిషి మృతితో విషాదంలో మునిగిపోయింది.
Next Story