రైతుకు రుణమాఫీ చేసి ఆ తర్వాత సంబరాలు చేసుకోండి : మానవతారాయ్

by Sridhar Babu |
రైతుకు రుణమాఫీ చేసి ఆ తర్వాత సంబరాలు చేసుకోండి :  మానవతారాయ్
X

దిశ, సత్తుపల్లి : రైతుకు లక్ష రూపాయల రుణమాఫీ చేసి ఆ తర్వాత సంబరాలు చేసుకోండి అని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటూరి మానవతారాయ్ బీఆర్​ఎస్​ నేతలకు హితవు పలికారు. రుణ మాఫీ కాక వడ్డీల భారం పెరిగి పోవడంతో పాటు వేసంగి పంట కొనే నాథుడు లేక అన్నదాతలు అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మిల్లర్లు, దళారుల చేతిలో రైతులు మద్దతు ధర లేక ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు.

ఒకరిద్దరు అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న రైతులకు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సన్మానాలు చేసినంత మాత్రాన ప్రయోజనం లేదని, అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ఇస్తానన్న ఎకరాకు పదివేల రూపాయలు ముందు చెల్లించాలని ఆయన సూచించారు. ప్రజాధనం దుర్వినియోగం చేసే సంబరాలు పక్కనపెట్టి రైతులను ఆదుకోవాలన్నారు. రైతులకు కావాల్సింది చికెన్ మటన్ భోజనాలు కాదని భరోసా కల్పించాలని కోరారు.



Next Story

Most Viewed