రోడ్డు ప్రమాద మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని రాస్తారోకో

by Sridhar Babu |
రోడ్డు ప్రమాద మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని రాస్తారోకో
X

దిశ, కూసుమంచి : నిన్న సాయత్రం ఖమ్మం సూర్యాపేట జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన శ్రీరాముల ఉప్పయ్య యాదవ్ (47) మృతదేహాన్ని కూసుమంచి లో ఖమ్మం సూర్యాపేట రహదారిపై ఉంచి రాస్తారోకో నిర్వహించారు. బుధవారం సాయంత్రం సుమారు 7 గంటల సమయంలో పొలం పనులు చేసుకొని ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరిన జుజ్జులరావుపేట గ్రామానికి చెందిన ఉప్పయ్యను పాలేరు నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న కారు ఎదురెదురుగా వచ్చి ఢీ కొట్టింది.

దాంతో తీవ్రంగా గాయపడ్డ ఉప్పయ్య సంఘటన స్థలంలోనే మరణించాడు. మృతదేహ్హాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన తరువాత మృతదేహాన్ని కూసుమంచికి తరలించి ఖమ్మం సూర్యాపేట రహదారిపై మృతదేహాన్ని ఉంచి సుమారు రెండు గంటలపాటు రాస్తారోకో నిర్వహించారు. తమకు న్యాయం చేయాలని, ఈప్రమాదానికి కారణమైన కారు నడుపుతున్న వ్యక్తిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దాంతో ఎస్సై సురేష్ కుమార్ బాధితులతో మాట్లాడి న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో బాధితులు శాంతించి రాస్తారోకో విరమించారు.



Next Story

Most Viewed