దేవుడి భూమి అమ్మేశారని ఆందోళన

by Sridhar Babu |
దేవుడి భూమి అమ్మేశారని ఆందోళన
X

దిశ, అశ్వారావుపేట : దేవుడి మాన్యంకు చెందిన భూములను ఊరి ప్రజలకు తెలియకుండా గ్రామ పెద్దలు అమ్మేసుకున్నారంటూ ఆరోపిస్తూ గ్రామస్తులు ఆందోళనకు దిగిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో చోటుచేసుకుంది. అశ్వారావుపేట మండలం జమ్మిగూడెం రామాలయానికి చెందిన 18 ఎకరాల వ్యవసాయ భూమిని అమ్మి.. అదే ఊరికి చెందిన కొందరు గ్రామ పెద్దలు అమ్మి సొమ్ము చేసుకున్నారని.. వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్ ముందు పెద్ద ఎత్తున గ్రామస్తులు ఆందోళన చేపట్టారు.

గత ఇరువై ఏళ్లుగా సదరు భూమిలో కౌలుకు వ్యవసాయం చేస్తూ ఆ సొమ్మును ఆలయ నిర్వహణకు దూప దీప నైవేద్యాలకు వినియోగిస్తూ వస్తున్నామని.. అలాంటి భూమిని కొందరు పోర్జరీ సంతకాలతో అమ్మకున్నారని ఆరోపించారు. ఈ విషయంపై పోలీసులు విచారణ చేపట్టి కారకులను కఠినంగా శిక్షించాలని పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. అక్రమంగా అమ్మేసిన భూమిని తిరిగి ఆలయానికి స్వాధీనపరచి న్యాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.



Next Story