- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ప్రైవేట్ కార్మికులతో పనులు

దిశ,నేలకొండపల్లి : సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం జీపీ పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె కొనసాగుతుంది. దీంతో నియోజక వర్గంలోని నేలకొండపల్లి మండలంలోని గ్రామాల్లో ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతుంది. ప్రజారోగ్యం దృష్ట్యా పంచాయతీ పాలక వర్గం ప్రైవేట్ కార్మికులతో పైనంపల్లి గ్రామంలో పారిశుద్ధ్య పనులు చేపట్టింది. ఇది గమనించిన జీపీ కార్మికులు తమ సమస్య తీర్చే వరకు పనులు చేయడానికి వీలు లేదని అడ్డుకున్నారు.
పనులు చేస్తున్న ట్రాక్టర్ ని అడ్డుకొని భైఠాయించారు. ఈ క్రమంలో కొంత ఇబ్బందులు పడ్డ ప్రైవేట్ కార్మికులు పంచాయతీ సెక్రటరీకి సమాచారం అందించారు. ప్రజా క్షేమం దృష్టిలో ఉంచుకుని కార్మికులు సమన్వయం పాటించాలని సర్పంచ్ హితవు పలికారు. ప్రజారోగ్యం రీత్యా పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్నామని, అడ్డుకుంటే ఇబ్బందులు వస్తాయని జీపీ కార్మికులను హెచ్చరించారు. సామరస్య పూర్వకంగా ఎవరి పనులు వారు నిర్వర్తించాలని అలా లేనిపక్షంలో జీపీ కార్మికుల పై ఈఓకు ఫిర్యాదు చేస్తామన్నారు. జీపీ కార్మికుల న్యాయమైన డిమాండ్ లను పరిష్కరించకుండా ప్రైవేట్ కార్మికులతో పని చేయించడం తగదని మరో పక్క కార్మికులు అభిప్రాయపడ్డారు.