- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
కూలీల ట్రాక్టర్ బోల్తా... 36 మందికి గాయాలు
by Sridhar Babu |

X
దిశ, కారేపల్లి : కూలీల ట్రాక్టర్ బోల్తా పడి 36 మందికి గాయాలైన ఘటన సింగరేణి మండల పరిధిలోని భాగ్యనగర్ తండాలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం భాగ్యనగర్ తండా గ్రామానికి చెందిన 36 మంది కూలీలు అదే గ్రామానికి చెందిన నరేష్ ట్రాక్టర్ లో ఆ గ్రామం నుండి సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న నరేష్ మిర్చి తోటకు మిర్చి తెంపేందుకు వెళ్లారు. పనులు పూర్తయిన తర్వాత మధ్యాహ్నం 36 మంది కూలీలు అదే ట్రాక్టర్లో మిర్చి వేసుకొని ఇంటికి వస్తున్న క్రమంలో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా కొట్టడంతో అందరికీ తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన కూలీలను స్థానికులు ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు స్థానికులు తెలిపారు.
Next Story