భవన నిర్మాణ కార్మికులకు పని భద్రత కల్పించాలి

by Sridhar Babu |
భవన నిర్మాణ కార్మికులకు పని భద్రత కల్పించాలి
X

దిశ, ఖమ్మం టౌన్ : భవన నిర్మాణ కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో వాగ్దానం చేసిన మోటార్ సైకిల్ ను వెంటనే ఇవ్వాలని, ఉపాధి భద్రత తో కూడిన చట్టాన్ని వెంటనే అమలు చేయాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి జి.రామయ్య డిమాండ్ చేశారు. గురువారం రామ నర్సయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ప్రగతిశీల భవన నిర్మాణ ఇతర కార్మికుల సంఘం (ఐ.ఎఫ్ టీయూ అనుబంధం) జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షులు పేరబోయిన ఎంకన్న అధ్యక్షతన జరిగిన సమావేశం లో రామయ్య మాట్లాడుతూ సంక్షేమ బోర్డులో వేలాదిమంది కార్మికులు బెనిఫిట్స్ కోసం అప్లై చేసుకుని సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు కార్మికులకు రావలసిన బెనిఫిట్స్ రావట్లేదని వారు ఆరోపించారు.

పెళ్లి కానుకను రూ.50 వేలకుపెంచాలని, నేచురల్ డెత్ ను ఐదు లక్షలు, యాక్సిడెంట్ డెత్​కు రూ.10 లక్షలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికీ పెరిగిన ధరల వల్ల కార్మికులకు వచ్చే వేతనాలు సరిపోక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు విమర్శించారు. కావున పెంచిన ధరలను తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. కార్మికులకు కార్మిక చట్టాలను అమలు చేయాలని, పని ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని వారు కోరారు. తెలంగాణ ప్రభుత్వం నిర్మాణ కార్మికులకు పెన్షన్​ 50 సంవత్సరాలు దాటిన వారికి ఐదు వేల రూపాయలు మంజూరు చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ నగర అధ్యక్షులు కంకణాల శ్రీనివాస్, తెలంగాణ ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గోసి పుల్లయ్య, జిల్లా ఉపాధ్యక్షులు గొడుగు విజయ్, జిల్లా సహాయ కార్యదర్శి శీలం లెనిన్, జిల్లా నాయకులు జి.రవీందర్, బి.రమేష్, బి.కోటేశ్వరరావు, కందుల వెంకటేశ్వర్లు, మేక వెంకయ్య, భిక్షం పాల్గొన్నారు.



Next Story

Most Viewed