వాటర్ ట్యాంక్ ఎక్కి కాలనీవాసుల నిరసన

by Sridhar Babu |   ( Updated:2023-05-22 10:18:11.0  )
వాటర్ ట్యాంక్ ఎక్కి కాలనీవాసుల నిరసన
X

దిశ,జూలూరుపాడు : డబుల్ బెడ్ రూం ఇళ్ల విషయంలో తమకు న్యాయం చేయాలని బాధితులు వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం...భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని పాపకొల్లు భీమ్లా తండాలో గత మూడు సంవత్సరాలు క్రితం డబుల్ బెడ్ రూమ్లను ఏర్పాటు చేశారు. అప్పటి తహసీల్దార్ లబ్ధిదారుల ఎంపికలో భాగంగా డ్రా పద్ధతిని నిర్వహించారు.

ఆ డ్రా లో ఎంపికైన సుమారు 15 మంది నేటి వరకు ఆ ఇండ్లలోకి వెళ్లలేదు .ఆ ఇండ్లను వేరే వారు ఆక్రమించడంతో ఏడు రోజుల నుంచి నిరాహార దీక్షలు చేస్తున్నప్పటికీ అధికారులు ఎవరూ పట్టించుకోవటం లేదు. దాంతో సోమవారం దగ్గర్లో ఉన్న వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలియజేశారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని లబ్ధిదారులను తహసీల్దార్ ఆఫీస్ కు తీసుకొని సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో మహిళలు టవర్ దిగి వచ్చారు.



Next Story