- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
మోసపోయిన వృద్ధురాలు.. ఇంట్లో ఉండగా మత్తు మందు ఇచ్చి..

దిశ, బూర్గంపాడు: ఓ లేడీ కిలాడి వృద్ధురాలికి కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి ఇచ్చి అమె సృహ కోల్పోయిన తర్వాత మెడలోని బంగారు నాన్ త్రాడు(గొలుసు)ను అపహరించిన సంఘటన బూర్గంపాడు మండలం కేంద్రంలో చోటు చేసుకుంది బాధితుల తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
బూర్గంపాడు మండల కేంద్రంలోని సోంపల్లి గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిలో కట్టా జగదీష్ ఇంటి ముందు నివాసముంటున్న మర్లపాటి నరసమ్మ,భర్త గోపయ్య వృద్ధ దంపతులు ఇంట్లో ఉండగా బంధువులందరూ పనులకు వెళ్లారు. ఈ క్రమంలో వృద్ధ దంపతులు ఇంటికి ఓ అనుమానిత కీలాడి మహిళ వారిని టార్గెట్ చేస్తూ మంచి నీళ్ళు కావాలి అని అడిగి వృద్ధురాలితో మాట మాట కలిపింది. వృద్ధురాలి మెడలోని బంగారం వివరాలు అడిగి తెలుసుకుంది. వృద్ధురాలికి ముందుగా ప్లాన్ ప్రకారం తెచ్చుకున్న మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ ను ఇచ్చింది. వృద్ధురాలు మత్తులోకి వెళ్లిన వెంటనే అమె మెడలోని రూ.1.5 లక్షలు విలువచేసే నానుత్రాడు(బంగారు గొలుసు)ను దొంగలించి అక్కడి నుంచి పరారైంది. వృద్ధురాలు సృహ తప్పి పడిపోవడాన్ని ఆలస్యంగా గమనించిన బంధువులు హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.సృహలోకి వచ్చిన వృద్ధురాలు చెప్పిన వివరాల ప్రకారం బంగారు నాన్ త్రాడు దొంగిలించిందని తెలుసుకొని బూర్గంపాడు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.