- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
దమ్ముంటే నాపై గెలిచి చూపించు : పిడమర్తి రవికి ఎమ్మెల్యే సండ్ర సవాల్

దిశ సత్తుపల్లి : మీడియా లో ఆరోపణ చేసిన పిడమర్తి రవి దమ్ముంటే సత్తుపల్లి నుంచి తనపై పోటీ చేసి గెలిచి చూపించాలని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సవాల్ విసిరారు. సిద్దాంత పరంగా మాట్లాడాలని, ఎవరి శక్తి ఏమిటో చూసుకుందాం అని పేర్కొన్నారు. జూదాలు ఆడేవారు ఎవరో తనకు తెలుసన్నారు. మండల పరిధిలోని గంగదేవి పాడు గ్రామానికి చెందిన ఈడా సాంబశివరావు ఇటీవల మరణించగా ఆయనకు బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఉండటంతో ఇన్సూరెన్స్ కింద రెండు లక్షల రూపాయల చెక్కు మృతుని భార్య రజనీకి అందజేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల కోసం బాధ్యతతో బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుందని అన్నారు.
ఎన్నిలు వచ్చినప్పుడే కార్యకర్తలను వాడుకోవడం కొన్ని రాజకీయ పార్టీలు చేస్తాయి కానీ బీఆర్ఎస్ అధికార పార్టీ అలా కాదన్నారు. ప్రజల బాధలను తీర్చిన మన నాయకుడు కేసీఆర్ అన్నారు. ప్రజలు తమకు బ్రహ్మరథం పడుతున్నారంటే ముఖ్యమంత్రి పాలనే కారణమన్నారు. తెలంగాణ రాకముందు వచ్చిన తర్వాత ప్రభుత్వం అమలు చేసిన పథకాలను గుర్తించాలని కోరారు. మండలలో త్వరలోనే 120 మంది గిరిజనులకు పట్టాలు ఇవ్వనున్నట్లు చెప్పారు. సాగు నీటి ని విడుదల చేసేందుకు కృషి చేశామన్నారు.
పలు మండలాల్లో ఎకరా కూడా ఎండిపోకుండా 15 రోజుల పాటు సెకండ్ జోన్లో ఎన్ఎస్ పీ నీళ్లు అందించాలని అధికారులతో సమీక్ష నిర్వహించినట్టు చెప్పారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కనగాల వెంకటరావు, జెడ్పీటీసీ సభ్యులు శక్కిలాల మోహన్రావు, పెనుబల్లి ఎంపీపీ నీలిమ, బీఆర్ఎస్ నాయకులు ముక్కర భూపాల్ రెడ్డి, సర్పంచ్ అశోక్ కుమార్, పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.