భద్రాచలం నుండే మళ్లీ పోటీచేస్తా : ఎమ్మెల్యే వీరయ్య

by Sridhar Babu |
భద్రాచలం నుండే మళ్లీ పోటీచేస్తా : ఎమ్మెల్యే వీరయ్య
X

దిశ, మణుగూరు : భద్రాచలం ప్రజలే దేవుళ్లని...అక్కడి నుండే పోటీచేస్తానని భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య స్పష్టం చేశారు. సోమవారం దిశతో ఆయన కొద్దిసేపు ముచ్చటించారు. రాబోయే ఎన్నికల్లో ములుగు నుండి పోటీ చేసే అవకాశం వస్తే పోటీ చేస్తారా అన్న ప్రశ్నకు తనని ఆదరించిన భద్రాచలం నుండే మళ్లీ బరిలో ఉంటానన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అన్ని స్థానాలను కైవసం చేసుకునే దిశగా కలిసికట్టుగా పనిచేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అధిష్టానం నిర్ణయం మేరకే అందరం కలిసి గెలుపుకోసం శ్రమిస్తామన్నారు.

విభేదాలు లేవు...

పినపాక కాంగ్రెస్ లో విభేదాలు లేవని, కలిసి కట్టుగా పనిచేసి గెలిచి తీరుతామని ఎమ్మెల్యే పొదెం వీరయ్య అన్నారు. పినపాక కాంగ్రెస్ లో వర్గవిభేదాలు లేవని, అందరం కలిసికట్టుగా పనిచేసి పినపాకలో గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. పినపాక నుండి పోటీచేందుకు చాలామంది ఆశావహులు పోటీలో ఉన్నారని, కానీ స్థానికులకు మాత్రమే ప్రాధాన్యత ఉంటుందన్న విషయాన్ని ప్రస్తావించారు. నియోజకవర్గంలోని అందరిని కలుపుకుని కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసే దిశగా స్థానిక నాయకత్వం నిరంతరం శ్రమిస్తోందని స్పష్టం చేశారు.



Next Story

Most Viewed