- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
బీఆర్ఎస్లో ఎవరిదారి వారిదే...

దిశా/ జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో బీఆర్ఎస్లో ఎవరిదారి వారిదే అన్నట్టు మారింది. ఇక్కడ మరో వర్గం పురుడు పోసుకుంది. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల మద్దతుదారులు రెండు వర్గాలుగా ఉండగా పొంగులేటి మద్దతుదారులు మరో దారి చూసుకున్నారు. ఆయా వర్గాలు నూతన సంవత్సరంలో శుభాకాంక్షలు తెలిపేందుకు వేర్వేరుగా ర్యాలీలు నిర్వహించి, సభలను ఏర్పాటు చేశారు. వీరితోపాటు పొంగులేటి మద్దతుదారులు కూడా ఖమ్మం వెళ్లారు. శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారతారనే ఊహాగానాల మధ్య అతని మద్దతుదారులు ప్రత్యేక కూటమిగా మామారు. వీరిని మిగతా వారు సైడ్ చేస్తున్నారా! లేక సైడ్ అయిపోతున్నారా అనే విషయం అర్ధం కావడం లేదు. బీఆర్ఎస్ లో ఇన్ని వర్గాలేమిటనే చర్చ జరుగుతోంది. మదన్ లాల్ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆయన వర్గం మదన్లాల్ వైపు ఉంటూనే తరచూ మండలంలో శుభ, అశుభ కార్యక్రమాలు, పర్యటనలు చేయిస్తున్నారు. ఆ తర్వాత సిట్టింగ్ ఎమ్మెల్యే రాములునాయక్ వర్గం పాత కొత్త సభ్యులతో బలం పుంజుకుంది. ఈ క్రమంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీ మారతారనే ఊహాగానాలు ఆవర్గం వారిని గందరగోళంలోకి నెట్టేశాయి. అటు ఎమ్మెల్యే వర్గంతో, ఇటు మాజీ ఎమ్మెల్యే వర్గంతో కలవలేక సతమతమవుతున్నారు. ఈ క్రమంలోని నూతన సంవత్సర వేడుకల్లో వేర్వేరుగా సభలు ఏర్పాటు చేయడం, పార్టీ ఆఫీస్ ప్రారంభించడం, మరో వర్గం ఖమ్మంలో శ్రీనివాస్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపేందుకు వెళ్లడం మండలంలో హాట్ టాపిక్ గా మారింది.