- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
మాడుపల్లిలో డబ్ల్యూహెచ్ఓ బృందం పర్యటన

దిశ, మధిర : జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన జాతీయ ఫైలేరియా, నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య సిబ్బంది పనితీరును ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందం డాక్టర్ రాజేందర్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో పరిశీలించారు . మున్సిపాలిటీ పరిధిలోని మాడుపల్లిలో ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి తిరుగుతూ బోదకాలు నివారణ మాత్రలు సరైన పద్ధతిలో ఇస్తున్నారా లేదా అని తనిఖీ చేశారు. ప్రజలకు బోద కాలు ఏ విధంగా వస్తుంది, వాటి లక్షణాలు గురించి వివరిస్తూ బోదకాలు రాకుండా ముందస్తుగా ఏ విధంగా
చర్యలు చేపట్టాలి అనే విషయాలను తెలియజేయాలన్నారు. బోద వ్యాధిని నివారిద్దాం,- బోద కారక దోమలను అరికడదాం, డీఈసీ ఆల్ఫెండజోల్ మాత్రలు మింగిదాం వంటి ప్లే కార్డులతో ప్రచారం నిర్వహించారు. 1-2 సంవత్సరాల వయసున్న పిల్లలకు అర్ధ మాత్రను, ఆపై వయసు వారికి ఒక మాత్రను అన్నం తిన్న తర్వాత మింగించాలన్నారు. కార్యక్రమంలో వైద్యులు పృథ్వీ , ఆరోగ్య సిబ్బంది లంకా కొండయ్య , ఏఎన్ ఎంలు లీలా, సునీలా, హెచ్ఏ నాగేశ్వరావు, ఆశ వర్క్ లు అంజమ్మ ,నిర్మల, సునీత, అరుణ తదితరులు పాల్గొన్నారు.