- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
కవితక్క ఎక్కడ.. అభిమానుల ఎదురు చూపు

దిశ, నిజామాబాద్ సిటీ : రాష్ట్ర ఐటీ శాఖ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నిజామాబాద్ ఐటీ హబ్, ఇతర అభివృద్ధి పనులను ప్రారంభించడానికి బుధవారం రాగా ఎమ్మెల్సీ కవిత కార్యక్రమాలకు గైర్హాజరు కావడంతో అభిమానులు ఆమె కోసం ఎదురు చూశారు. కేటీఆర్ సభ ఇంతకు ముందు వాయిదా పడటంతో, ఈ సారి ఆయన ప్రోగ్రాం కోసం ఏర్పాట్లను, జాబ్ మేళా లాంటి కార్యక్రమాలను దగ్గరుండి చూసుకున్న ఎమ్మెల్సీ కవిత, ఐటీ హబ్ ప్రారభోత్సవానికి పాల్గొనకుండా ఉండడంతో అభిమానుల్లో కొంత నిరుత్సాహం కనిపించిందనే చెప్పాలి.
రాష్ట్ర ఐటీ శాఖ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వచ్చారన్న సంతోషం ఒక పక్క అయితే జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ కవిత రాకపోవడంతో పార్టీలోను, ఇతర పార్టీల్లోనూ చర్చనీయ అంశంగా మాయింది. కావాలని పాల్గొనలేదా అని కొందరు, జ్వరం రావడంతో పాల్గొనలేదని కొందరు, సీఎం క్యాంప్ కార్యాలయంలో అత్యవసర పని ఉండడం వల్ల రాలేకపోయారని కొందరు మాట్లాడుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఏది ఏమైప్పటికీ ఎమ్మెల్సీ కవిత పాల్గొనక పోవడంతో అభిమానుల్లో, బీఆర్ఎస్ నాయకుల్లో, శ్రేణుల్లో అంత జోష్ కనిపించలేదు.