- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
వరదలు మిగిల్చిన రహదారి గుంటలు పూడ్చేది ఎప్పుడు ?

దిశ, కూసుమంచి : మండలంలోని పాలేరు నరసింహుల గూడెం నుండి ఎర్రగడ్డ తండా కొత్తూరు వరకు రహదారికి అడుగడుగునా ఒక ఫీట్ నర లోతున గుంతలు పడి రహదారి ప్రయాణం ప్రమాదకరంగా మారింది. దీనికి నేషనల్ హైవేరోడ్డు కాంట్రాక్టర్లు ఒక కారణమైతే, ఇటీవల కాలంలో కురిసిన వర్షాలకు వరదలతో రోడ్లన్నీ దెబ్బతినడం మరొక కారణంగా మిగిలింది. గత రెండు సంవత్సరాల నుండి మంచి మండలంలో నాయకన్ గూడెం నుండి తల్లంపాడు వరకు 18 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి పనుల నిమిత్తం మాన్లు టిప్పర్ల ద్వారా అధిక లోడుతో మండలంలోని అనేక గ్రామాల నుండి అధికలోడు మట్టితో లింకు రోడ్ల ద్వారా జాతీయ రహదారికి మట్టి తోలించిన అధికారులు, కాంట్రాక్టర్లలే ప్రధాన కారణమని ప్రజలు ఆరోపిస్తున్నారు. మట్టి తోలకంలో ప్రధానంగా ఎర్రగడ్డ తండా కొత్తూరు ప్రాంతాల నుండి నరసింహుల గూడెం పాలేరు గ్రామాల రహదారుల మీదుగా నేషనల్ హైవేకి మట్టి తోలకం చేపట్టారు.
దీనివలనే ప్రధానంగా రహదారులు దెబ్బతిన్నాయి. మళ్లీ దీనికి తోడుగా ఇటివల కాలంలో కురిసిన వర్షాలకు వరదలకు రోడ్లన్నీ మరింత అద్వానంగా మారాయి. నరసింహులగూడెం కొత్తూరు వెళ్లే రహదారి సమీపంలో చాప్ట సైతం అధిక మట్టి లోడులతో దెబ్బ తిని పగిలిపోయిన చాప్ట ఇటీవల వచ్చిన వరదలకు కుంగిపోయి రాకపోకలు సాధించే ప్రయాణికులకు అంతరాయంగా మారి ప్రమాదాలకు నిలయంగా మారింది. జాతీయ రహదారి పనులు ముగిసిన వెంటనే మట్టి తొలకానికి ఉపయోగించిన లింక్ రోడ్ల మరమ్మతులు చేస్తామని హామీ ఇచ్చి సంవత్సరం గడుస్తున్నప్పటికీ, అధికారులు గుత్తేదారులు అడ్రస్ లేకుండా పోవడంతో ఇవల కురిసిన భారీ వర్షాలకు రోడ్లన్నీ అధ్వానంగా మారటంతో ప్రజలు, రాకపోకలు సాగించే ప్రయాణికులు రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదే రహదారుల వెంట అత్యవసర సేవలు 108, 104 మొదలైన రవాణా సేవలు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, ప్రజలు ఈ రహదారి గుండా ప్రయాణించాలంటే నరకం చూస్తున్నారు. అనేకమార్లు ఈ రహదారుల వెంట ప్రయాణిస్తూ మార్గమధ్యలో వాహనాలు ఆగిపోయి హరిగోస పడుతూన్నామని, వాహనాలు రిపేరుకు వస్తున్నాయని తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు గుత్తేదారులు ఈ ప్రాంతాల రహదారులను యుద్ధ ప్రతిపాధికన పనులు చేపట్టి రహదారులను బాగు చేయాలని కోరుతున్నారు.