- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఏ మొఖం పెట్టుకొని పాదయాత్రలు చేస్తున్నారు : మంత్రి శ్రీనివాస్ యాదవ్ ఘాటు విమర్శ

దిశ, అంబర్ పేట్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక సోషల్ మీడియాలో నరంలేని నాలుకలు ఎన్నో మాట్లాడుతున్నాయని, 45 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వంలో నీళ్లు ఇచ్చారా? ఇప్పుడు ఏం మొఖం పెట్టుకొని పాద యాత్రలు చేస్తున్నారని పశు సంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఘాటుగా విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం 99వేల ఉద్యోగాలు భర్తీ చేస్తే.. టీఎస్పీఎస్సీ లో ఎవరో ఇద్దరు చేసిన చెడు పనికి... కొన్ని కుక్కలు కేసీఆర్, కేటీఆర్ ను తిడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ సాయుధ పోరాటయోధుడు దొడ్డి కొమురయ్య 96వ జయంతి వేడుకలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, ఎక్సైజ్ క్రీడా, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొని దొడ్డి కొమురయ్య చిత్ర పటానికి పూల మాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ మొట్టమొదటి సారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలను నిర్వహించుకోవడం సంతోషదాయకమన్నారు.
నిజాం, రాజకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేసి బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి దొడ్డి కొమురయ్య కృషి చేశారన్నారు. తెలంగాణలో మహనీయుల గొప్ప చరిత్ర ఉందన్నారు. ఎన్నికల్లో తమ ఓట్లను రాజకీయంగా వాడుకుని వదిలేసిన గత ప్రభుత్వాలు వంద సంవత్సరాల చరిత్ర ఉన్న దొడ్డి కొమురయ్య చరిత్రను కనీసం పాఠ్య పుస్తకాలలో పెట్టలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహనీయుల చరిత్రను వెలికితీసి గౌరవించుకుంటున్నామని తెలిపారు. ట్యాంక్ బ్యాండ్ పై దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని స్థాపించడానికి తనవంతు కృషి చేస్తానన్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ లంగాణ సాయుధ పోరాటం మొదలైంది దొడ్డి కొమురయ్య కుటుంబం నుండే అని వివరించారు. మొట్ట మొదటి సారి తిరుగుబాటు చేసిన వారిలో మొదట సర్దార్ సర్వాయి పాపన్న అయితే రెండవది దొడ్డి కొమురయ్య అన్నారు. 1946లో తెలంగాణ సాయుధ పోరాటంలో అమరుడైన మహనీయుడు దొడ్డి కొమురయ్య అని కొనియాడారు.
ఎమ్మెల్సీ యెగ్గే మల్లేశం మాట్లాడుతూ దొడ్డి కొమురయ్య జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడానికి జీఓ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం, గొర్రెల మేకల అభివృద్ది శాఖ చైర్మన్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు, బీసీ కమిషన్ సభ్యులు కిషోర్ గౌడ్, ఉపేందర్, గొల్ల కుర్మా సంఘాల రాష్ట్ర నాయకులు బండారు నారాయణ, క్యామ మల్లేశం, కొలువుల నరసింహం, ఎక్కల కన్నా, కొండల్ రాజు, వినోద్ కుమార్, బాలామణి, మిరియాల విజయ పాల్గొన్నారు.