కాంగ్రెస్ పార్టీతోనే సంక్షేమ పథకాలు సాధ్యం..జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య

by Sumithra |
కాంగ్రెస్ పార్టీతోనే సంక్షేమ పథకాలు సాధ్యం..జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య
X

దిశ, ఇల్లందు : తెలంగాణా ప్రాదేశిక కాంగ్రెస్ కమిటీ ఆదేశానుసారం సోమవారం ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలోని 16, 17, 18 వార్డులలో గడపడపకూ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇల్లందు పట్టణంలోని 16వ వార్డులోగల షిరిడీ సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం, మున్సిపాలిటీ పరిధిలోని 16, 17, 18 వార్డుల నందుగడపగడకూ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టటం తధ్యమని, కేంద్రంలో రాహుల్ గాంధీ, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సారథ్యంలో ఆడబిడ్డలకు 500 రూపాయలకే వంట గ్యాస్, నిరుపేదలకు ఆరోగ్య శ్రీ పథకం ద్వారా ఐదు లక్షల రూపాయలతో ఉచిత వైద్యం, సొంతింటి కల సాకారానికి ఐదులక్షల రూపాయలు, ఇంట్లో ఇద్దరు వృద్ధులు ఉంటే నెలకు ఐదువేల రూపాయల ఫింక్షన్, వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళ, కల్లుగీత, చేనేత కార్మికులు, డయాలసిస్, ఎయీడ్స్, పైలెరియా, బాధితులకు నెలకు నాలుగు వేల రూపాయల ఫింక్షన్ వంటి కార్యక్రమాలను గడపగడపకూ వెళ్ళి ప్రచారం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు దొడ్డా డానియేలు, పట్టణ ప్రధాన కార్యదర్శి మహ్మద్ జాఫర్, మాజీ మున్సిపల్ చైర్మన్ యదల్లపల్లి అనసూర్య, మండల అధ్యక్షులు పులి సైదులు, టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుదర్శన్ కోరి, మైనారిటీ అధ్యక్షులు మసూద్, మున్సిపల్ కౌన్సిలర్ పత్తి స్వప్న, ఎస్సీ సెల్ అధ్యక్షులు లింగంపల్లి శ్రీను, బీసీ సెల్ అధ్యక్షులు శంకర్, ఎస్టీ సెల్ అధ్యక్షులు వీరూ, సీనియర్ నాయకులు ఈశ్వర్ గౌడ్, జీవీ భద్రం, ఐజాక్, చిన్నా శ్రీను, వెంకట నారాయణ, ఐఎన్టీయూసీ మహబూబ్, సైదేమియా, మున్నా, రెడ్డి, మడుగు సాంబమూర్తి, బోళ్ళ సూర్యం, చిల్లా శ్రీనివాస రావు, నంద కిషోర్, ఆవుల సైదులు, ఇమామ్, సన్నాయిల సరస్వతి, సునిత, సువర్ణ, విజయ భారతి, అక్బర్, కౌశిక్, సర్పంచులు పాయం స్వాతి, పాయం లలిత, కల్తీ పద్మ, ఎంపీటీసీలు మండల రాము, పూనెం సురేందర్, ముక్తి కృష్ణ, తాటి బిక్షం, ఆముదాల ప్రసాద్, గుగ్లోత్ నాగార్జున, కాకాటి భార్గవ్, ఊరుగోండ ధనుంజయ్, బానోత్ శారద, సదానందం, రావూరి సతీష్, ప్రసన్న కుమార్ యాదవ్, బక్కతట్ల వెంకన్న, పాయం ఆంజనేయులు, గొడుగు వేణు, పండు, తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed