- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
మున్నేరు వరద బాధితులకు అండగా ఉంటాం

దిశ, ఖమ్మం : మున్నేరు ముంపు ప్రాంతాల బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. సోమవారం మంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.. మున్నేరు నది నుంచి ప్రజలకు శాశ్వత పరిష్కారం కోసం సీఎం కేసీఆర్ శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నాలు చేయాలని సూచించడంతో శాశ్వత పరిష్కారం కోసం ఆర్సీసీ వాల్ కడితే బాగుంటుందని సూచించిన వెంటనే కేసీఆర్ గో ఏ హెడ్ అంటూ భుజం తట్టారన్నారు. వెంటనే రూ. 150 కోట్లు మంజూరు చేసి క్యాబినెట్ ఆమోదం అమోదించడం జరిగిందన్నారు. మున్నేరు వరద బాధితులకు ఆసరాగా నిలిచేందుకు రాజ్యసభ సభ్యుడు పార్థసారధి రెడ్డితో మాట్లాడి కోటి రూపాయలను, తన కోడలు మున్నేరు వరద బాధితులను చూసి చలించి తన సొంత డబ్బులు రూ. 50 లక్షలు ఇవ్వడం జరిగిందన్నారు.
వచ్చిన నగదును జిల్లా కలెక్టర్ కు ఇచ్చినట్టు తెలిపారు. మున్నేరు ముంపు ప్రాంతాల్లో కొంత మంది తిరుగుతూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు మాయమాటలు చెబుతున్నారన్నారు. మున్నేరు వరద నష్టపోయిన బాధితులను స్థానిక కార్పొరేటర్ సహాయంతో రూ. 10 వేలు అందించడం జరుగుతుందన్నారు. ఆర్టీసీ మునిగిపోకుండా ఉండాలనేది తన ఆకాంక్ష అన్నారు. సమ్మె సమయంలో కార్మిక సంఘాలు వచ్చి శాలువాతో సన్మానించి సమ్మె నోటీసు చేతిలో పెట్టడం జరిగింది అన్నారు. అయినా వారికి భరోసా కల్పించామన్నారు. అనంతరం సీపీఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్, నాయకులు హేమంత్ రావు, జానిమియ ఆధ్వర్యంలో ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా రీజియన్ అధ్యక్షులు పిల్లి రమేష్, కార్యదర్శి పాటి అప్పారావు, వర్కింగ్ ప్రెసిడెంట్ బి. వెంకన్న, ఖమ్మం డిపో అధ్యక్ష,
కార్యదర్శులు బెతంపుడి బుచ్చి బాబు, కార్యదర్శి జి.శ్రీనివాస్ రావు, నాయకులు దుద్దుకురి కిరణ్ కుమార్, దమ్మలపాటి శ్రీనివాస్ రావు, సంజీవ రావు తదితరులు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ని కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చి కృతజ్ఞతలు తెలిపారు. వారికి మంత్రి పువ్వాడ మిఠాయి తినిపించి అభినందనలు తెలిపారు. ఈ క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో మేయర్ పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహార, డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం, సుడా చైర్మన్ విజయ్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ దోరేపల్లి శ్వేత, నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, గుండాల కృష్ణ, కార్పొరేటర్ లు కర్నాటి కృష్ణ, కన్నం వైష్ణవి ప్రసన్న, రుద్రగాని శ్రీదేవి ఉపేందర్, దాదే ఆమృతమ్మ సతీష్, తోట ఉమా వీరభద్రం, పసుమర్తి రాంమోహన్, సరస్వతి రవినాయక్, తోట గోవిందమ్మ రామారావు, సిటీ లైబ్రరీ ప్రెసిడెంట్ అశ్రీఫ్, మైనార్టీ అధ్యక్షుడు తాజుద్దీన్, నాయకులు బత్తుల మురళి, పొన్నం వెంకటేశ్వర్లు, కొల్లు పద్మ, తన్నీరు శోబారాణి, సాద్ తదితరులు పాల్గొన్నారు.