- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
కస్టమర్లకు ఎల్లప్పుడూ సేవలందిస్తాం

దిశ బ్యూరో, ఖమ్మం : తమ సంస్థలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి ఎప్పటికీ తగిన సేవలందిస్తామని, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా స్వయంగా తనను సంప్రదించి నివృత్తి చేసుకోవచ్చని మైత్రి డెవలపర్స్ అధినేత శెట్టి శ్రీనివాస్ తెలిపారు. తమ వెంచర్ లో ప్లాట్లు కొనుగోలు చేసిన ఎవ్వరినీ మోసం చేయలేదని, సమాచార లోపంతోనే తప్పుడు ప్రచారం జరిగిందని ఆయన వెల్లడించారు. ఏడెనిమిది సంవత్సరాల క్రితం రఘునాథపాలెం మండలం ఈర్లపుడిలో వెంచర్ వేశామని చెప్పారు. వెంచర్లో కొన్ని ప్లాట్లు బల్క్ గా కొందరికి విక్రయించామని, వారే కస్టమర్లకు అమ్మారని చెప్పారు. కస్టమర్ల ప్లాట్లలో తామే మల్బార్ వేప సాగుచేశామని, చెట్లు డ్యామేజీ కావడంతో శాస్త్రవేత్త సూచనతో వాటిని తొలగించామని వెల్లడించారు.
కొన్ని విక్రయించగా వచ్చిన నగదును కొంత మంది ప్లాట్ల యజమానులకు షేర్ చేసి ఇచ్చామన్నారు. మిగతా కొందరి సమాచారం తమ వద్ద అందుబాటులో లేకపోవడంతో ఇవ్వలేకపోయామని, వారిని సంప్రదించిన తర్వాత చెల్లిస్తామని తెలిపారు. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ అని, ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. కొనుగోలు దారులకు ఎలాంటి సమస్య ఎదురైనా స్వయంగా తనను సంప్రదించవచ్చని, కస్టమర్లకు ఎల్లప్పుడూ సేవలందించేందుకు సిద్ధంగా ఉంటామని శ్రీనివాస్ తెలిపారు. క్రయవిక్రయాల్లో రిజిస్ట్రేషన్ల సమయంలో ఎలాంటి ఇబ్బంది లేదని, ఎవరి ప్లాట్లు వారికే ఉన్నాయని, చెట్లు పెరిగి దట్టంగా పెరగడంతో వాటిని శుభ్రం చేయించామని పేర్కొన్నారు. అంతేతప్ప ఏ కస్టమర్ ను ఉద్దేశపూర్వకంగా ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదని, మైత్రి డెవలపర్స్ ఎన్నడూ అలాంటి పనులకు పాల్పడదని వెల్లడించారు.