పండుగపూట కూడా మాకు ఈ తిప్పలు తప్పవా?

by S Gopi |   ( Updated:2022-10-02 07:57:06.0  )
పండుగపూట కూడా మాకు ఈ తిప్పలు తప్పవా?
X

దిశ‌, ఖ‌మ్మం రూర‌ల్: తెలంగాణ రాష్ట్రంలో తాగునీటి స‌మ‌స్యకు చెక్ పెట్టేందుకు గాను ప్రభుత్వం మిష‌న్ భ‌గీర‌థ అనే ప‌థకం ప్రవేశ‌పెట్టి ప‌ల్లెపల్లెన స‌ప్లై చేసేందుకు వేల కోట్ల రుపాయ‌ల‌ను కేటాయించి ఖర్చు చేసింది. అయితే క్షేత్రస్థాయిలో గ్రామాల్లో నిర్వహ‌ణ సాధ్యం కాక‌పోవ‌డంతో ప్రజ‌ల‌కు తాగునీరు అంద‌డంలేదు. రూర‌ల్ మండ‌లంలో మొత్తం 24 పంచాయ‌తీల్లో ఈ ప‌థ‌కం ద్వారా గ్రామాల్లో గ‌ల వాట‌ర్ ట్యాంక్‌ల్లో పాలేరు ప్రాజెక్టు నుంచి స‌ర‌ఫ‌రా చేస్తున్నారు. అక్కడి నుంచి ఇంటింటికి తాగునీరు అందించేంద‌కు న‌ల్లాల‌ను సైతం అమ‌ర్చారు. కానీ గతవారం రోజులుగా రూర‌ల్ మండ‌లం త‌ల్లంపాడు వ‌ద్ద పైపులైన్ మ‌ర‌మ్మత్తుల‌కు గుర‌వ‌డంతో పంచాయ‌తీల్లో తాగునీరు లేక జ‌నం అల్లాడుతున్నారు. స‌ర్పంచ్‌లు వాట‌ర్ ట్యాంక‌ర్ల ద్వారా అందిస్తున్నా ఇబ్బందులు త‌ప్పడం లేదు. ద‌స‌రా పండుగ రావ‌డంతో ప్రతి ఇంటికి బందువులు రాక ఉండ‌టంతో నీటి అవ‌స‌రం కూడా ఉంటుంది. పైప్‌లైన్ మ‌ర‌మ్మత్తుల‌కు గుర‌వ‌డంతో ప్రజ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. గ‌తంలో పంచాయ‌తీల్లో ఉన్న వాట‌ర్ స‌ప్లై ద్వారానే బాగుండేద‌ని, ఇప్పటికీ ప‌లుమార్లు రిపేర్లు రావ‌డం నీటి స‌ప్లై బంద్ కావ‌డం ప‌రిపాటిగా మారింది. ముఖ్యంగా గ‌త కొంతకాలం నుంచి నాయుడుపేట‌, జ‌లగంన‌గ‌ర్‌, సాయిగ‌ణేష్‌న‌గ‌ర్‌, ఇందిర‌మ్మకాల‌నీ, వెంక‌ట‌గిరి ఇందిర‌మ్మకాల‌నీ ఫెస్‌-1, ఫెస్‌-2, ఆరేకోడు, త‌ల్లంపాడు, ఆరెంపుల వంటి గ్రామాల్లో నీటి స‌ప్లై బంద్ కావ‌డంతో మ‌హిళలు అగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. నాయుడుపేట‌లో ఇంటింటికి నీరు రాక చాల రోజులైందని ప్రజ‌లు అగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. పాలేరు ప్రాజెక్టు నుంచి నేరుగా రూర‌ల్‌కు నీరు వ‌చ్చే విధంగా అధికారులు పైప్‌లైన్ మార్గం ఏర్పాటు చేసిన ఫ‌లితం శూన్యం. మిష‌న్‌భ‌గీర‌థ ప‌థ‌క నిర్వహ‌ణ అధికారుల‌కు క‌త్తిమీద సాముల‌గా మారిందని అభిప్రాయ‌ప‌డుతున్నారు.

రూర‌ల్‌లో తాగునీటి కోసం క‌ట‌క‌ట‌

ప్రభుత్వం మిష‌న్‌భగీర‌థం ప‌థ‌కం అమ‌లు చేసి ప్రతి గ్రామానికి ఓ ప్రత్యేక ట్యాంక్ నిర్మించి వాట‌ర్‌ను స‌ప్లై చేస్తున్నారు. కానీ గ‌త వారం రోజుల నుంచి రూర‌ల్‌కు వాట‌ర్ స‌ప్లై లేక‌పోవ‌డంతో స్థానిక స‌ర్పంచ్‌ల‌కు ఇబ్బందులు త‌ప్పడంలేదు. కొంతమంది స‌ర్పంచ్‌లు గ‌తంలో ఉన్న బోర్ల ద్వారా వాట‌ర్ స‌ప్లై చేస్తుండ‌గా మ‌రికొంత‌మంది పంచాయతీ ట్యాంక్‌ర్‌తో ప్రత్యామ్నాయ చ‌ర్యలు చేప‌డుతున్న ఇబ్బందులు త‌ప్పడంలేద‌ని స‌ర్పంచ్‌లు అవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద పంచాయ‌తీల్లో వాట‌ర్ ట్యాంకర్ ద్వారా వాట‌ర్ పంపిణీ అనేది క‌ష్టసాధ్యమైన ప‌ని అని చెప్పాలి.

పండుగ‌పూట ప‌స్తులే..

పండుగ‌పూట తాగేందుకు, వాడుకునేందుకు నీళ్లు లేక‌పోవ‌డంతో ప‌స్తులు ఉండాల్సి వ‌స్తుంద‌ని ప్రజ‌లు ఆందోళ‌న చెందుతున్నారు. పండుగ వ‌స్తుంద‌న్న ఆలోచ‌న కూడా అధికారుల‌కు, ప్రజాప్రతినిధుల‌కు లేక‌పోవ‌డం చాలా దారుణ‌మైన విష‌యం అన్నారు. నీళ్ల కోసం రోడ్లు ఎక్కే ప‌రిస్థితి వ‌స్తుంద‌ని, తాగునీరు కోసం ఇక ఇబ్బందులు ఉండ‌వ‌ని సీఎం కేసీఆర్ మిష‌న్‌భ‌గీర‌థ ప‌థ‌కం పెట్టినా ఫ‌లితం శూన్యం. పండుగ‌పూట నీటి స‌మ‌స్యను అధిగ‌మించేందుకు అధికారులు, స్థానిక స‌ర్పంచ్‌లు కూస్తి ప‌డుతున్నారు.

నీళ్లు అందించ‌లేక ఇబ్బందులుప‌డుతున్నాం: కేతినేని వేణు, స‌ర్పంచ్‌, త‌న‌గంపాడు

మిష‌న్‌భ‌గీర‌థ నీళ్లు రాక వారం రోజుల దాటింది. ప్రజల‌కు నీళ్లు అందించాలంటే ఇబ్బందిగా ఉంది. పంచాయ‌తీ ప‌రిధిలోని గుండాతండా గిరిజ‌నుల‌కు నీళ్లు లేక ఇబ్బందులు ప‌డుతున్నారు. గ‌తంలో వినియోగంలో ఉన్న బోర్లు, బావులు వాడుకంలోకి తీసుక‌రావాలంటే ఖ‌ర్చుతో కూడిన ప‌ని. వాటికి ఖ‌ర్చు చేసేందుకు అధికారుల అనుమ‌తిలేదు. పండుగ‌పూటనీళ్ల అందించ‌క‌పోతే ఇబ్బందులు త‌ప్పవు.



Next Story

Most Viewed