- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
నేలపట్లలో పడకేసిన పారిశుధ్యం.. బురదతో కంపుకొడుతున్న వార్డులు

దిశ, కూసుమంచి: తెలంగాణ రాష్ట్ర నూతన పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం ప్రతి పల్లెలు పరిశుభ్రంగా ఉంచాలని లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. గ్రామాల్లో పారిశుధ్యం, మొక్కల పెంపకం, విధి దీపాల నిర్వహణ, పన్నులు ఇతర ఆదాయాల సేకరణ గ్రామ పంచాయితీల ప్రధాన బాధ్యత. కానీ కొన్ని గ్రామాల్లో మాత్రం పారిశుద్ధ్యం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు అస్తవ్యస్తంగా తయారైంది. మండలంలోని కొన్ని గ్రామాల్లో పంచాయతీ సర్పంచులు నూతన పంచాయతీరాజ్ చట్టానికి తూట్లు పొడిచే విధంగా వ్యవహరిస్తున్నారు. అందుకు నేలపట్ల ప్రథమ స్థానంలో ఉంది. వివరాల్లోకి వెళితే.. మండల పరిధిలోని నేలపట్ల ,ముత్యాల గూడెం, నరసింహుల గూడెం, తురక గూడెం, ఉడతల గూడెం సంధ్య తండా, నరసింహుల గూడెం తో పాటు మండలం లో అనేక గ్రామాల్లో పారిశుద్ధ్య లోపం తో కాలనీ విదులన్ని అస్తవ్యస్తంగా ఉన్నాయి.
ఎక్కడ చూసినా మురుగునీరు దర్శనమిస్తున్నాయి. దీంతో దోమల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. పారిశుద్ధ్యానికి సంబంధించిన ఎటువంటి పనులను దోమల నివారణ చర్యలుగా మురుగు కాలువల్లో ద్రావణాలు పిచికారీ చేయాల్సి ఉన్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. దీంతో నీరు నిలువ ఉండి వార్డుల్లో బురద కంపు కొడుతుంది. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు, దోమల బెడద మరింత పెరిగే అవకాశం ఉండటంతో వ్యాధులు మరింత పెరిగే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నేలపట్లలో ఈ బజారు గుండా వృద్ధులు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, వికలాంగులు, మహిళలు నడవాలంటే అనేక అవస్థలు పడుతూ నడవలేని పరిస్థితి నెలకొంది.
పల్లెల్లో పారిశుద్ధ్యం పడకేసింది
పల్లెల్లో పారిశుద్ధ్యం పడకేసింది. ప్రజారోగ్యం ప్రశ్నార్ధకంగా మారింది. చినుకు రాలితే రోడ్లు చిత్తవుతున్నాయి. మురుగు నీళ్లతో గ్రామాలు కన్నీళ్లు పెడుతున్నాయి. ప్రజా ప్రతినిధుల పర్యటనలప్పుడు గుప్పెడు బ్లీచింగ్ చల్లి గుడ్ అనిపించుకుంటున్నారు. ఏటా కోట్ల రూపాయలు కుమ్మరిస్తున్న పల్లె రాత మారడం లేదు. అదే వ్యథ.. అవే సమస్యలు. గ్రామాల్లో వర్షాకాలం రాకముందే పారిశుద్ధ్య పనులు ప్రారంభించాల్సి ఉంది. డ్రైనేజీల్లో పూడికతీత, నీటినిల్వ కుంటల్లో ఆయిల్ బాల్స్, బ్లీచింగ్, దోమల మందు పిచికారి వంటి పనులు చేపట్టాలి. అయితే నిధులు లేవనే సాకుతో అధికారులు గ్రామాల వైపు కన్నెత్తి చూడడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడైనా ఉన్నతాధికారులు దృష్టి పెట్టి పరిష్కార మార్గం చూపాలని నేలపట్ల, ముత్యాల గూడెం, నరసింహుల గూడెం, సంధ్య తండా మండలంలోని పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.