- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
నా భర్తకు ప్రాణభిక్ష పెట్టండి సారు..

దిశ, కల్లూరు : రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద కుటుంబాలలో ఆర్థిక సంక్షోభం ఏర్పడితే వారి అవస్థలు వర్ణనాతీతం. కుటుంబ సభ్యుల భవిష్యత్తు భద్రత ఇంటి యజమాని పై ఆధారపడి ఉంటుంది. ఇంటి యజమాని అచేతన స్థితిలో ఉంటే ఆ కుటుంబ పరిస్థితి భగవంతుడికెరుక. అటువంటి దుర్భరమైన స్థితి మండల కేంద్రంలోని శాంతినగర్ లో చోటు చేసుకుంది. 32 ఏళ్లకే తన భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారి మృత్యువుతో పోరాడుతున్నాడు. తన కళ్లేదుటే కుటుంబం ఆర్థిక స్థితిగతులతో అవస్థల పడుతున్న తానేమి చేయలేక దీనంగా ఎదురుచూస్తున్నాడు. పిల్లలకు బంగారు భవిష్యత్తు అందిస్తాడనుకున్న భర్త అనారోగ్యంతో అవస్థ పడుతుంటే తన ఆరోగ్యాన్ని కాపాడుకోలేని ఆర్థిక స్థితి తనని దాతల సహాయం కోసం ఎదురుచూస్తూ తన భర్తకు ప్రాణబిక్ష పెట్టండంటూ రోధిస్తుంది. కట్టుకున్న భర్త చనిపోయాడు. వయస్సైయిపోయిన తల్లికి ఎదిగొచ్చిన కొడుకు అండగా ఉంటాడనుకుంటే వైద్యం లేనిదే కొడుకు బ్రతకటం కష్టమేనని తెలిసి మనోవేదనతో కృంగిపోతున్న తల్లి ఆర్తనాదాలు.
షుగర్, బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో తన పరిస్థితే అగమ్య గోచరంగా ఉంటే కొడుకు కుటుంబ ఏమైపోతుందోనని ఆయుష్ ను కూడగట్టుకొని జీవిస్తుంది. ఎటుచూసినా ఆర్థిక సంక్షోభమే. ఆ కుటుంబానికి దాతల సహాయం అవసరం. అటువంటి దీనస్థితిలో శాంతినగర్ కు చెందిన మాతిపోగు రవి (32), రవి భార్య సరస్వతి , ఇద్దరు పిల్లలు కుమార్తె సుస్మిత(12), కుమారుడు విశ్వంత్ (09) వీరితోపాటు తన తల్లి మరియమ్మ(60) తనపై ఆధారపడిన కుటుంబం ఉంది. తాపీ, రైస్ మిల్లుల్లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గత కొద్ది కాలంగా అనారోగ్యానికి గురవు తుండడంతో పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో వైద్యం చేయించుకోగా తక్షణమే ఖమ్మం వైద్యశాలకు వెళ్ళమని చెప్పడంతో అక్కడ వైద్యులు పరీక్షలు చేసి రెండు కిడ్నీలు పాడైపోయాయని డయాలసిస్ చేస్తేనే బ్రతుకుతాడని లేకపోతే కష్టమేనని తేల్చిచెప్పడంతో తన శాయశక్తుల వడ్డీలకు మూడు లక్షలకు పైగా తెచ్చి తన భర్తను బ్రతికించుకునే ప్రయత్నం చేసింది.
15 రోజుల పాటు హాస్పిటల్లో ఉండి చేయించి చివరకు తన వద్ద డబ్బులు లేకపోవడంతో ఇంటికి తీసుకువచ్చారు. తనకు తెలిసిన వారి సమాచారంతో తిరువూరు ప్రభుత్వ వైద్యశాలలో డయాలసిస్ చేస్తున్నానని కానీ రెండు రోజులకు ఒకసారి డయాలసిస్ చేయాలి. ఒకవైపు అనారోగ్యంతో ఉన్న తన అత్తను చూసుకుంటూ, మరోవైపు పిల్లలను చక్కదిద్దుకుంటూ, భర్త వైద్యం కోసం వెళ్లాల్సిరావడంతో ఇంట్లో తింటానికి తిండి కూడా లేక ఆటోలకు చార్జీలు లేక నరకం అనుభవిస్తున్నానని వాపోయింది. వైద్యం చేయించకపోతే తన భర్త ఏమైపోతాడోనని భయబ్రాంతులకు గురై చేతకాని దీనస్థితిలో తన భర్తకు ప్రాణబిక్ష పెట్టండి, తన కుటుంబాన్ని ఆదుకోండంటూ ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తుంది. ఇంతటి క్లిష్ట పరిస్థితిలో ఉన్న మాతిపోగు రవి కుటుంబాన్ని మానవత్వంతో ఆదుకోవాలని దాతలను ఆశ్రయిస్తుంది. ఎవరైనా దాతలు ఉంటే సహకరించాలని కోరుకుందాం... ఆర్ధిక సాయం చేయదలచిన వారు 7288952808 ని సంప్రదించగలరు.