- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఓటు హక్కును వినియోగించుకోవడం అందరి బాధ్యత

దిశ ప్రతినిధి,కొత్తగూడెం : ఓటరుగా నమోదైన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ డా. ప్రియాంక తెలిపారు. నూతన ఓటర్ల నమోదు, ఓటుహక్కు వినియోగం, ఓటు ప్రాధాన్యతపై శనివారం జిల్లాలోని ఐదు నియోజకవర్గ కేంద్రాల్లో కచ్చితంగా ఓటు వేస్తాను (ఓట్ ఫర్ ష్యూర్) అనే అంశాలపై 5కే రన్ నిర్వహించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా కొత్తగూడెం నియోజకవర్గానికి సంబంధించి కొత్తగూడెం పట్టణంలోని పోస్టాఫీస్ సెంటర్ నుండి లక్ష్మీదేవిపల్లి మండలంలోని సెంట్రల్ పార్క్
వరకు నిర్వహించిన 5 కే రన్ ను జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓటు హక్కు ప్రాధాన్యతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు 5కే రన్ నిర్వహించినట్లు చెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటు కీలకమని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని కోరారు. ఫారం 6 ద్వారా నూతన ఓటరు నమోదు, ఫారమ్ 8 ద్వారా ఓటరు జాబితాలో చిరునామా, పోలింగ్ కేంద్రాల చేర్పులు, మార్పులు చేసుకోవడానికి అవకాశం ఉన్నట్లు చెప్పారు. కళాశాలల యాజమాన్యాలు 18 సంవత్సరాలు నిండిన విద్యార్థులకు ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. గతంలో తక్కువ ఓటింగ్ జరిగిన ప్రాంతాలలో ఓటింగ్ శాతం పెరిగేలా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, దీనికి అందరూ సహకరించాలని కోరారు. అనంతరం 5కే రన్ లో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు అందజేశారు.