సర్కార్ బడికి తాళం వేసిన గ్రామస్థులు.. ఎందుకో తెలుసా ?

by samatah |
సర్కార్ బడికి తాళం వేసిన గ్రామస్థులు.. ఎందుకో తెలుసా ?
X

దిశ దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మల్లారం గ్రామంలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు సరిపడా ఉపాధ్యాయులను నియమించాలని డిమాండ్ చేస్తూ బుధవారం పాఠశాలకు విద్యార్థుల తల్లిదండ్రులు తాళం వేశారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు మాట్లాడుతూ.. గత రెండు సంవత్సరాలుగా మల్లారం పాఠశాలలో కేవలం ఒకే ఉపాధ్యాయురాలతో విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారని, ఒకే ఉపాధ్యాయురాలున్న పాఠశాలకు పంపి తమ పిల్లల విద్యా భవిష్యత్ నాశనం చేయలేమని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే మల్లారం పాఠశాలకు సరిపడా ఉపాధ్యాయలను నియమించాలని డిమాండ్ చేశారు. దీంతో మండల విద్యాధికారి మరొక టీచర్ ను పాఠశాలకు నియమిస్తామని చెప్పడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన విరమించారు.



Next Story

Most Viewed