- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Home > జిల్లా వార్తలు > ఖమ్మం > పెట్రోలియం, సహజ వాయువు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా వద్దిరాజు
పెట్రోలియం, సహజ వాయువు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా వద్దిరాజు
by Dishanational1 |
X
దిశ, ఖమ్మం: ఇటీవలే రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన వద్దిరాజు రవిచంద్ర కీలకమైన పార్లమెంటరీ స్థాయి సంఘానికి సభ్యుడిగా ఎన్నికయ్యారు. భారత పెట్రోలియం, సహజ వాయువుల స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా ఆయనను నియామిస్తూ రాజ్యసభ బులెటిన్ విడుదలైంది. పలు పార్లమెంటరీ స్థాయి సంఘాలకు చేపట్టిన పునర్నియామకాలలో వద్దిరాజుకు కీలకమైన స్థాయి సంఘం వరించింది. ఆయన ఈ కమిటీ సభ్యుడిగా తన రాజ్యసభ పదవీకాలం వరకు కొనసాగుతారు. దేశంలో పెట్రోలియం ఉత్పత్తులు, సహజవాయువు నిక్షేపాలు సంబంధిత అంశాలను ఈ కమిటీ సమీక్షిస్తుంది. ఉభయ సభలకు ఈ అంశాలపై అవసరమైన సూచనలు కూడా చేస్తుంది. పెట్రోలియం, సహజవాయువుల స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా నియమితుడైన వద్దిరాజు రవిచంద్రను టీఆర్ఎస్ పార్లమెంటరీ కమిటీ చైర్మన్ కె. కేశవరావు, లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు, సహచర పార్లమెంట్ సభ్యులు అభినందించారు.
Next Story