- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
కనీవినీ ఎరుగని రీతిలో BRS సభ సక్సెస్: MP నామా నాగేశ్వర్ రావు

దిశ, ఖమ్మం సిటీ: అందరి సమిష్టి కృషితో ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ బహిరంగ సభ మహాద్బుతంగా విజయవంతమైందని బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం ఇక్కడ ఒక ప్రకటన విడుదల చేశారు. ఉమ్మడి జిల్లా నుంచి భారీ ఎత్తున లక్షలాదిగా స్వచ్ఛందంగా తరలి వచ్చి సభను కనీవినీ ఎరుగని రీతిలో ద్విగ్విజయం చేశారని అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా మరింత అభివృద్ధికి సీఎం కేసీఆర్ సభా వేదిక నుంచి వందల కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినందుకు ఎంపీ నామా కేసీఆర్కు ప్రత్యేకించి, కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా నాయకులు, మండల, గ్రామ క్షేత్ర స్థాయి నాయకత్వం అవిరళ కృషి, పట్టుదలతో శ్రమించి సభను అబ్బురపర్చేలా విజయవంతం చేశారని అన్నారు.
సభ బ్రహ్మాండగా సక్సెస్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు, అభినందనలు తెలిపారు. సభ సక్సెస్కు అన్ని స్థాయిల నాయకత్వ కృషి కారణమని పేర్కొన్నారు. భవిష్యత్లో పార్టీ ఏ పిలుపునిచ్చినా ఇదే సూర్తితో ఉద్యమ స్పూర్తితో శ్రమించి, సత్తా చాటాలని పేర్కొన్నారు. సభ విజయవంతాన్ని పురస్కరించుకొని ఖమ్మంలోని ఎంపీ నామ స్వగృహం వద్ద పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బండి పార్థసారధి రెడ్డి, ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ, పార్టీ జిల్లా అధ్యక్షులు తాతా మధుసూదన్, మోరంపూడి ప్రసాద్, సోషల్ మీడియా మధిర నియోజకవర్గ ఇంచార్జ్ తాళ్లూరి హరీష్, నామా సేవా సమితి నాయకులు పాల్వంచ రాజేష్, చీకటి రాంబాబు, రేగళ్ల కృష్ణ ప్రసాద్, స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.