- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
అనారోగ్యం భరించలేక ఆత్మహత్యాయత్నం

దిశ, టేకులపల్లి : మూడు రోజుల క్రితం అనారోగ్యంతో బాధపడుతూ పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. టేకులపల్లి ఎస్ఐ గన్ రెడ్డి రమణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం టేకులపల్లి మండల కేంద్ర గ్రామపంచాయతీ పరిధి ఏ కాలనీ తండా గ్రామానికి చెందిన దారావత్ శంకర్ (48) అనే వ్యక్తి గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఇంటి వద్ద ఉంటున్నాడు. అనారోగ్య సమస్య వలన
ఆర్థిక ఇబ్బందులు వచ్చాయని బాధితుడు ఈనెల 8వ తేదీ మంగళవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో పురుగు మందు తాగాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కొత్తగూడెం ప్రభుత్వ హాస్పిటల్ కు తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం మృతి చెందాడు. మృతుడి భార్య దారావత్ విజయ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రమణారెడ్డి తెలిపారు. మృతుడు రోజువారి కూలి పనులకు వెళ్తాడు. అతడికి భార్య విజయ ఉంది.