- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
వేరువేరు కేసుల్లో ఇద్దరు దొంగల అరెస్ట్

దిశ, సత్తుపల్లి : సత్తుపల్లి పట్టణ పరిధిలోని రాజీవ్ నగర్ కాలనీకి చెందిన మిరియాల విజయ ఇంట్లో 21వ తేదిన రాత్రి గుర్తుతెలియని దొంగలు ఇంట్లోకి ప్రవేశించి బీరువాలో ఉన్న బంగారు వస్తువులతో పాటు డబ్బులు దొంగిలించారని ఫిర్యాదు ఇచ్చింది. దీనిపై కేసు నమోదు చేసారు. పోలీసులు ఈరోజు ఉదయం రాజు కాలనీకి చెందిన ఏడా మహేష్ 22ను అదుపులోనికి తీసుకుని విచారించగా నేరవ అంగీకరించినట్లు బంగారు వస్తువులు స్వాధీన పరుచుకున్నట్టు స్థానిక ఎస్సై సీఐ కరుణాకర్ ఒక ప్రకటనలో తెలిపారు.
సత్తుపల్లి పట్టణ పరిధిలోని వెంగళరావు నగర్ కాలనీకి చెందిన గోపోజు భాస్కరాచారి ఇంట్లో ఈనెల 9న రాత్రి సమయంలో గుర్తులు తెలియని దొంగలు ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న బంగారు వస్తువులు , వెండి వస్తువులు దొంగిలించారని ఫిర్యాదు ఇచ్చాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఉదయం వెంగళరావు నగర్ కు చెందిన ఏకాంగి సత్య శ్రీ అదుపులోకి తీసుకొని విచారించగా ఆ దొంగతనం చేసినట్లు అంగీకరిస్తూ ఆ వస్తువులను బయటపెట్టింది, వస్తువులను స్వాధీనం చేసుకున్న పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు, ఈ కేసులో అధికారి సీఐ కరుణాకర్, ఎం శ్రీనివాసరావు, లక్ష్మణరావు, ను ఏసిపి రామాంజనేయులు వీరిని అభినందించారు.