రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు దుర్మరణం

by Disha Web Desk 15 |
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు దుర్మరణం
X

దిశ, పెనుబల్లి : మండల పరిధిలోని వీఎం బంజర్ సత్తుపల్లి రోడ్డు లోని హెచ్​పీ పెట్రోల్ బంక్ వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అస్సాం నుండి హైదరాబాద్ కు టీ పొడి లోడుతో వెళుతున్న కంటైనర్ లారీ, మహారాష్ట్ర నుండి రాజమండ్రి బియ్యం లోడుతో వెళుతున్న లారీ ఎదురెదురుగా బలంగా ఢీకొనడంతో రెండు లారీల డ్రైవర్లు క్యాబిన్లలో ఇరుక్కుని పోయారు. పోలీసులు సుమారు రెండు గంటలు శ్రమించి క్యాబిన్లో ఇరుక్కున్న ఇద్దరు డ్రైవర్లను బయటకు తీసే సమయానికి ఇద్దరు కొన ఊపిరితో ఉండడంతో సమీపంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే సమయంలో మరణించారు.

మరణించిన డ్రైవర్లు బీహార్ కి చెందిన ధర్మేంద్ర కుమార్ యాదవ్, మహారాష్ట్ర బాలాషా కు చెందిన సంతోష్ గా గుర్తించారు. ఈ సంఘటనతో ఖమ్మం రాజమండ్రి జాతీయ రహదారిపై వాహనాలు రాకపోకలు సుమారు మూడు గంటల సేపు స్తంభించిపోయాయి. మహారాష్ట్ర నుండి రాజమండ్రి బియ్యం లోడుతో వెళుతున్న లారీ డ్రైవర్ మద్యం సేవించి లారీ నడపడం వలన ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదంలో రెండు లారీల క్యాబిన్లు పూర్తిగా ధ్వంసం కాగా ఓ డీసీఎం మరొక టాటా ఏస్​ పక్షంగా ధ్వంసం అయ్యాయి.


Next Story

Most Viewed