- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
విషాదం.. రోడ్డు ప్రమాదంలో యువకుడితోపాటు 18 నెలల చిన్నారి మృతి

దిశ, తిరుమలాయపాలెం: మండలంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. మాదిరిపురం గ్రామ సమీపాన రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొని యువకుడుతోపాటు 18 నెలల చిన్నారి మృతిచెందింది. ఇందుకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని చింతల తండాకు చెందిన బోడ శివ(25) బుధవారం రాత్రి తన ద్విచక్ర వాహనంపై మరిపెడ బంగ్లాకు వెళుతున్నాడు. గోల్ తండాకు చెందిన బోడ మూర్తి-విభూ, కొడుకు రాజా, అతని కుమార్తె ఆరాధ్య(18 నెలలు) ద్విచక్ర వాహనంపై కాకరవాయి వెళ్లి తిరిగి గోల్ తండాకు వెళుతున్నారు. ఈ క్రమంలోనే మాదిరిపురం స్టేజి వద్దకు రాగానే, రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బోడ శివ అనే యువకుడు, చిన్నాపి ఆరాధ్య తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందారు. మూర్తి, విభూలకు తీవ్ర గాయాలయ్యాయి. రాజా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స కోసం 108 అంబులెన్స్ ద్వారా ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. వివరాలు సేకరించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.