- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
అగ్నికి ఆహుతైన రెండు కార్లు
by Shiva |

X
పాత కక్షలే కారణమంటున్న బాధితుడు
దిశ, ఇల్లందు: మండల పరిధిలోని బాలాజీనగర్ పంచాయతీ వార్డు సభ్యులు కోటికి చెందిన కారుతో పాటు మరో కారును ఆదివారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేశారు. వార్డు సభ్యులు కోటి తెలిపిన వివరాల ప్రకారం.. తన ఇంటి ముందు నిలిపి ఉంచిన కారు అగ్నికి ఆహూతి కాగా వెనుక ఉన్న మరో కారు సైతం స్వల్పంగా కాలిందని తెలిపారు. ఉద్దేశపూర్వకంగానే నలుగురు వ్యక్తులు తన కారును దగ్ధం చేశారని కోటి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్సై రాజేష్ ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. ఇటీవల పంచాయతీ పాలకవర్గంలో విభేదాలతో నాయకుల మధ్య పరస్పర ఆరోపణలు చేసుకున్నామని కోటీ తెలిపాడు. ఆ గొడవలే ఈ ఘటనకు దారి తీశాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల విచారణలో ఎలాంటి నిజాలు బహిర్గతం కానున్నాయనేది సస్పెన్స్ గా మారింది.
Next Story