యాక్టివ్‌మోడ్‌లోకి తుమ్మల నాగేశ్వరరావు

by Mahesh |
యాక్టివ్‌మోడ్‌లోకి తుమ్మల నాగేశ్వరరావు
X

దిశ, కూసుమంచి: అభివృద్ధికి పర్యాయ పదం తుమ్మల నాగేశ్వరరావు ఇది అనుచరులు ఆయన గురించి చెప్పే మాటలు. ఇటీవల పాలేరు నియోజకవర్గంలో వరుస కార్యక్రమాలు నిర్వహిస్తున్న తుమ్మల బరిలో ఉన్నానంటూ సంకేతాలు ఇస్తున్నాడు. కేసీఆర్ తనకు అవకాశం ఇవ్వడంతోనే అభివృద్ధి చేశానని, గెలిపించిన ప్రజల రుణం తీర్చుకోవడానికి పోటీలో ఉంటానని అనుచరులతో స్పష్టం చేస్తున్నాడు. గతంలో తాను చేసిన అభివృద్ధితో అత్యంత ఖరీదైన ప్రాంతంగా పాలేరు నిలిచిందని, గోదావరి జలాలు పాలేరుకు తేవాలనేదే చిరకాల కోరిక అని, సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసేందుకే తాను పాలేరులో పోటీలో ఉంటానని స్పష్టం చేస్తున్నారు. శాశ్వత ప్రాతిపదికన తప్ప తాత్కాలిక కార్యక్రమాల ద్వారా ప్రజలు బాగుపడ్డారని, సీపీఐ, కాంగ్రెస్, టీడీపీలు సైతం తనకు మద్దతు ఇస్తామంటున్నాయని చెబుతున్నారు. గతంలో కనీసం లక్ష రూపాయలకు అమ్ముడు పోనీ ఎకరం భూమి ధర ప్రస్తుతం సుమారు రూ.50 లక్షల వరకు పలుకుతున్నది అంటే దానికి కారణం తుమ్మల అని అభిమానులు చెప్పుకుంటున్నారు.

ఖమ్మం నగరంలో తుమ్మలకు సొంత ఇల్లు ఉన్నా... నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండాలనే కారణంగా ఖమ్మం రూరల్ మండలం శ్రీసిటీలో ఇళ్లు ఏర్పాటు చేసుకొని స్థానికంగా ఉంటున్నారు. ఇక సామాజిక పరంగా అంచనా వేస్తే ఖమ్మం రూరల్, నేలకొండపల్లి మండలాల్లో కమ్మ సామాజిక ఓట్లు గణనీయంగా ఉన్నాయి. ఆ ఓట్లను తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. గతంలో ఎప్పుడు ఎన్నికల్లో తన కుటుంబ సభ్యులను ముందుకు తీసుకొని రాని తుమ్మల, పాలేరు ఓటమి తర్వాత తన కుమారుడైన యుగంధర్‌తో నియోజక వర్గంలో అనేక కార్యక్రమాలు చేయిస్తూ అనుచరులు చేయిజారకుండా వారిని ఏదోలా షోషల్ యాక్టివిటీస్ చేసేలా ప్రేరేపిస్తున్నారు. తన పదవీ కాలంలో నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు రూ.12వేల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేయించిన తుమ్మల తిరిగి తనకు టిక్కెట్ వస్తే రాష్ట్రంలోనే పాలేరును అత్యున్నత నియోజక వర్గంగా తీర్చి దిద్దుతానని సెలవిస్తున్నారు ఒకవేళ తమ నాయకుడికి పార్టీ టికెట్ నిరాకరిస్తే ఇండిపెండెంట్‌గా పోటీ చేసైనా లెక్క సరిచేసి తమ సామర్థ్యం నిరూపిస్తామని తుమ్మల అనుచర వర్గం సవాల్ విసురుతుంది.



Next Story

Most Viewed