పద్మశాలీలకు సైతం రాజకీయాల్లో అవకాశాలు: మంత్రి పువ్వాడ

by S Gopi |
పద్మశాలీలకు సైతం రాజకీయాల్లో అవకాశాలు: మంత్రి పువ్వాడ
X

దిశ, ఖమ్మం బ్యూరో: పద్మశాలీలకు కూడా రాజకీయాల్లో అవకాశం కల్పిస్తామని.. వారిని అన్నివిధాలా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. పవిత్ర కార్తీక మాసం సందర్భంగా ఆదివారం ఖమ్మంలోని చెరుకూరి రామకోటి గార్డెన్స్ లో పద్మశాలీల వనసమారాధన కార్యక్రమం సభాధ్యక్షుడు, ఖమ్మం జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు, టీఆర్ఎస్ జిల్లా నాయకుడు, 24 డివిజన్ కార్పొరేటర్ కమర్తపు మురళి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా పద్మశాలి కుల బాంధవులు 12,000 మంది హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి హాజరై మాట్లాడుతూ.. పద్మశాలీలు అన్ని రంగాల్లోనూ ఉన్నారని, జిల్లాలో వారికి రాజకీయాల్లో కూడా అవకాశాలు కల్పిస్తామన్నారు. కేసీఆర్ సర్కార్ పద్మాశాలీను, నేత కార్మికులను ఎన్నో విధాలుగా ఆదుకుంటుందన్నారు. భవిష్యత్తులో కూడా వారికోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టనుందని చెప్పారు. పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు కమర్తపు మురళి మాట్లాడుతూ.. పద్మశాలీలు ఐక్యంగా ఉండి అన్నివిధాలా ముందుకు సాగాలన్నారు. వెనుకబడిన వారికి చేయూతనిచ్చి మిగతావారు ప్రోత్సహించాలని కోరారు. సర్కార్ పద్మశాలీల అభివృద్ధి కోసం కట్టుబడి ఉందని.. అన్ని విధాలా సహాయం చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. కేసీఆర్ సర్కార్ కు తోడుగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా గౌరవ అధ్యక్షుడు బొమ్మ రాజేశ్వరరావు మాట్లాడుతూ.. ఇప్పటికే పద్మశాలీలు అన్ని రంగాల్లో ఉన్నారని.. రాజకీయాల్లో కూడా తగిన గుర్తింపు, అవకాశాలు కల్పించాలని కోరారు.

కిడ్నీ బాధితురాలికి ఆర్థిక సాయం...

చింతకాని మండలం రామకృష్ణాపురం గ్రామానికి చెందిన కుందన శైలజ రెండు కిడ్నీలు పనిచేయడం లేదు. కిడ్నీల్ని మార్చవలసి ఉన్నందున వైద్య ఖర్చులు నిమిత్తం వన భోజనాల్లో కుల బాంధవులు అందరు రూ. 1,90,000 సహాయం చేశారు. బాధితురాలి కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం ఎల్ఓసీ సైతం ఇప్పిస్తానని ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ హామీ ఇచ్చారు. వనభోజనాలలో బతుకమ్మ వేడుకలను 22 అడుగుల పథకమును ఏర్పాటు చేసి సంబరాలు జరిపించారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పిలుపు మేరకు చేనేతపై కేంద్ర ప్రభుత్వం విధించిన జీఎస్టీని తొలగించాలని పదివేల మంది పోస్ట్ కార్డులను రాసి ప్రధాన మంత్రికి పంపించారు. శ్రీ చైతన్య కళాభారతి వారి దొంగలు నాటకం కూడా అలరించింది. అలాగే పాల్గొన్న మహిళలకి వంద మందికి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీల్లో గెలుపొందినవారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి చిలకమర్రి శ్రీనివాసబాబు, నియోజకవర్గ అధ్యక్షుడు పెండెం జనార్దన్, కూరపాటి ప్రదీప్, బండారు శ్రీనివాస్, రచ్చ శ్రీనివాస్, దుస్సా సత్యనారాయణ, మహిళా అధ్యక్షురాలు సునీత, సంధ్యారాణి, దేవరశెట్టి సత్యనారాయణ పారుపల్లి సత్యనారాయణ, వీరభద్రం, పిల్లలమర్రి కొండలరావు తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed