దళిత బంధులో 45 మంది విలేకరులకు ఛాన్స్.. ఎమ్మెల్యే సంచలన నిర్ణయం

by Dishafeatures2 |
దళిత బంధులో 45 మంది విలేకరులకు ఛాన్స్.. ఎమ్మెల్యే సంచలన నిర్ణయం
X

దిశ, గుండాల: దళిత బంధు రెండో విడత కార్యక్రమం విషయంలో పినపాక శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రేగా కాంతారావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. రెండో విడత దళిత బంధులో నియోజకవర్గంలోని 45 మంది దళిత జర్నలిస్టులకు దళిత బంధును అందించనున్నట్లు ఆయన ప్రకటించారు. శనివారం ఆయన చేసిన ఈ ప్రకటన సంచలనాన్ని సృష్టించింది.

తన క్యాంపు కార్యాలయంలో శనివారం జరిగిన నియోజకవర్గ స్థాయి దళిత విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రెండో విడత దళిత బంధులో మీ అందరికీ ప్రాధాన్యత ఇస్తానని, మీరు కూడా ఆర్థిక అభివృద్ధి చెంది ముందుకు సాగాలని అన్నారు. ఎమ్మెల్యే తీసుకున్న ఈ నిర్ణయాన్ని పలువురు అభినందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత దళిత బంధు కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గానికి 500 మంది లబ్ధిదారులను ఎంపిక చేయాలని ఆదేశించగా అందులో 45 మంది విలేకరులకు ప్రాధాన్యత కల్పించడం పట్ల రేగా కాంతారావును అందరూ అభినందిస్తున్నారు. కాగా రేగా నిర్ణయం అభినందనీయమని టీయూడబ్ల్యూజే, టీజేఎఫ్ భద్రాది, కొత్తగూడెం జిల్లా నాయకులు కల్లోజు శ్రీనివాస్, వడ్లకొండ రవి అభినందనలు తెలిపారు.


Next Story

Most Viewed