మళ్లీ నేనే గెలుస్తానంటూ... రోడ్లపై డ్యాన్స్‌‌లు చేస్తున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే

by S Gopi |
మళ్లీ నేనే గెలుస్తానంటూ... రోడ్లపై డ్యాన్స్‌‌లు చేస్తున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే
X

దిశ, కారేపల్లి: వైరా సీటు తనకు ఖాయమని అదే ఊపులో గెలుపు ఖాయమంటూ వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్‌ ధీమా వ్యక్తం చేశారు. కారేపల్లి మండల అధ్యక్ష ప్రధానకార్యదర్శుల సన్మాన సభ శుక్రవారం కారేపల్లిలో నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మినర్సింహ గార్డెన్‌లో అధ్యక్షులు పెద్దబోయిన ఉమాశంకర్‌ అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో చరిత్ర సృష్టించా... మరోసారి గెలుపుతో మరో చరిత్ర సృష్టించబోతున్నట్లు తెలిపారు. 'ప్రజా సేవ చేయటానికి వైరా నియోజకవర్గ ప్రజలు అవకాశం ఇచ్చారు. అందరికి అందుబాటులో ఉంటూ క్రమశిక్షణతో అభివృద్ధికి చేస్తున్నా... ఎన్నో భావాజాలాలు ఉన్న మనం ప్రజల బాధలు తొలగించటానికి వచ్చాం... అదే బాటలో పయనిద్దాం. ఎన్నికలు వస్తున్నాయి... ఆయుధాలకు పదునుపెట్టాల్సిన అవసరం ఉంది. మనకు ప్రతిపక్షమే లేదు.. ఓటు కోసం కోట్లు ఖర్చుపెట్టేవారు వస్తారు. పోరాటాల గడ్డ వారసులం.. వారిని అభివృద్ధి నినాదంతో పడగొడదాం. నాకు ప్రజలు ఫైవ్‌ ఇయర్స్‌ ప్రమోషన్‌ ఇస్తే మీ అందరికీ ప్రమోషన్‌ ఇస్తా'నంటూ నాయకులను ఉత్తేజపరిచారు. నూతనంగా బీఆర్‌ఎస్‌ అధ్యక్ష ప్రధానకార్యదర్శి బాధ్యతలు చేపట్టిన పెద్దబోయిన ఉమాశంకర్‌, ఇస్లావత్‌ బన్సీలాల్‌ లను సన్మానించారు.

డ్యాన్స్‌ వేసిన ఎమ్మెల్యే...

కారేపల్లిలో బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు నిర్వహించిన భారీ ర్యాలీ వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్‌ డీజే పాటలకు డ్యాన్స్‌ వేస్తూ కార్యకర్తలను ఉత్సహపరిచారు. నూతన అధ్యక్షప్రధానకార్యదర్శులు పెద్దబోయిన ఉమాశంకర్‌, ఇస్లావత్‌ బన్సీలాల్‌, మాజీ ప్రధాన కార్యదర్శి అజ్మీర వీరన్న ఆధ్వర్యంలో గతంలో ఎన్నడూ జరగని విధంగా కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ర్యాలీ ముందు భాగంలో ఎమ్మెల్యే డీజే పాటలకు అనుగుణంగా స్టేప్పులేస్తూ కార్యకర్తలను ఉత్సహపరిచారు. ఎమ్మెల్యేతో కలిసి నాయకులు సైతం నృత్యం చేశారు. బాణాసంచాతో సందడిగా ర్యాలీ సాగింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాలోత్‌ శకుంతల, వైస్‌ఎంపీపీ రావూరి శ్రీనివాసరావు, సొసైటీ అధ్యక్షులు దుగ్గినేని శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు దారావత్‌ మంగీలాల్‌, రైతు బంధు మండల కన్వీనర్‌ గుగులోత్‌ శ్రీను, సంత ఆలయం చైర్మన్‌ మల్లెల నాగేశ్వరరావు, ఎంపీటీసీల సంఘం మండల అధ్యక్షులు దారావత్‌ పాండ్యానాయక్‌, సర్పంచ్‌ సంఘం మండల అధ్యక్షులు భూక్యా రంగారావు, మండల కో-ఆప్షన్‌ ఎండీ హనీఫ్‌, దిశ కమిటీ సభ్యులు బానోత్‌ కుమార్‌, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్‌ ముత్యాల సత్యనారాయణ, టీఆర్‌ఎస్‌ మాజీ మండల అధ్యక్షులు తోటకూరి పిచ్చయ్య, తోటకూరి రాంబాబు, మాజీ ప్రధాన కార్యదర్శి అజ్మీర వీరన్న, నాయకులు అడ్డగోడ ఐలయ్య, బానోతు పద్మావతి, పిల్లి వెంకటేశ్వర్లు, బిందే రమేష్‌, ఎర్రబెల్లి రఘు, మజీద్‌ పాషా, పాట్ల శ్రీను, చల్లా మోహన్‌రావు, ఇమ్మడి తిరుపతిరావు, బత్తుల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.



Next Story