- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
కమ్మ సంఘం జిల్లా అధ్యక్షుడిపై టీఆర్ఎస్ నాయకుల దాడి

దిశ, ఖమ్మం టౌన్: బీజేపీ జిల్లా నాయకులు, ఖమ్మం జిల్లా కమ్మ సంఘం జిల్లా అధ్యక్షులు ఏరినేని రామారావుపై టీఆర్ఎస్ నాయకులు, మంత్రి అజయ్ కుమార్ అనుచరులు తనపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని రామారావు తెలిపారు. శుక్రవారం నిర్వహహించిన కమ్మ సంఘం సమావేశంలో సంఘం అభివృద్ధి విషయాలపై చర్చించించే సమయంలో సంఘం ఎన్నికల సమయంలో జరిగిన పరిణామాలు టీఆర్ఎస్ కు చెందిన కొంత మంది సంఘం సభ్యులు తాను బీజేపీలో ఉండటాన్ని జిర్ణించుకోలేక తనపై ఆకరణంగా దాడి చేసి తీవ్రంగా కొట్టారు అని తెలిపారు. కమ్మ సంఘం ఎన్నికల్లో గెలిచినప్పటి నుండి తనను మంత్రికి అనుచరులుగా ఉన్న కొంత మంది కమ్మ సంఘం నాయకులు తనను టార్గెట్ చేశారని, గతంలో సైతం దాడి చేసారని, శుక్రవారం సమావేశ హాలులోనే అందరూ చూస్తుండగా దాడి చేశారని పేర్కొన్నారు. తీవ్ర గాయాలు అయిన రామారావును వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైద్రాబాద్ కు తరలిస్తున్నట్టు బీజేపీ నేతలు తెలిపారు. కాగా రామారావుపై జరిగిన దాడిని బీజేపీ జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డిలు తీవ్రంగా ఖండించారు. టీఆర్ఎస్ కు ఇక గతి లేదని బీజేపీ ఎదుగుదలను చూసి ఓర్వలేక దాడులు చేస్తున్నారని ఆరోపించారు.