మున్సిపల్ కార్మికుడి మృతి పట్ల మంత్రి సంతాపం.. అన్ని విధాలా ఆదుకుంటామని హామీ..

by Javid Pasha |
మున్సిపల్ కార్మికుడి మృతి పట్ల మంత్రి సంతాపం.. అన్ని విధాలా ఆదుకుంటామని హామీ..
X

దిశ, ఖమ్మం: వాటర్ ట్యాంక్ క్లీన్ చేస్తున్న క్రమంలో ఓ కార్మికుడు మృతి చెందిన ఘటన తెలిసిందే. అతడి మరణం పట్ల రావాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సంతాప తెలిపారు. అయితే నయాబజార్‌లో మంగళవారం వాటర్ ట్యాంక్ శుభ్రం చేస్తున్న క్రమంలో రూరల్ మండలం కామంచికల్ గ్రామానికి చెందిన ఖమ్మం మున్సిపల్ ఔట్ సోర్సింగ్ కార్మికుడు చిర్రా సందీప్ ప్రమాదవశాత్తు ఔట్లెట్ పైప్‌లైన్‌లో పడి మృతి చెందాడు. ప్రభుత్వం తరుపున సందీప్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని పువ్వాడ హామీ ఇచ్చారు. బుధవారం సందీప్ అంత్యక్రియల కార్యక్రమంలో నగర మేయర్ పాల్గొని సందీప్ పార్థివదేహానికి పూలమాల వేశారు. సందీప్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అంత్యక్రియల నిమిత్తం రూ.10వేల రూపాయలను తన పి ఏ.రవికిరణ్ చేతుల మీదుగా వారి కుటుంబానికి అందజేశారు. మృతుడి కుటుంబానికి మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ విజయ్, టీఆర్ఎస్ టౌన్ అధ్యక్షుడు పగడాల నాగరాజు, మున్సిపల్ సహాయ కమిషనర్ మల్లీశ్వరి, టీఆర్ఎస్ కేవీ నాయకుడు ఫణి, మృతుని కుటుంబాన్ని ఓదార్చి తమ సానుభూతి ప్రకటించారు.



Next Story