ఖమ్మం జిల్లాలో నలుగురు సీఐల బదిలీ

by Sridhar Babu |
ఖమ్మం జిల్లాలో నలుగురు సీఐల బదిలీ
X

దిశ, ఖమ్మం సిటీ : తెలంగాణ రాష్ట్రంలో మల్టీ జోన్ ఐజీ ఎస్ .చంద్రశేఖర్ రెడ్డి జీవో నెంబర్ 58 ప్రకారం వరంగల్ రీజియన్ లో 21 మంది సీఐలను బదిలీ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. దీనిలో భాగంగా ఖమ్మం జిల్లా కమిషనరేట్ పరిధిలో గల నలుగురు సీఐలు బదిలీ అయినట్లు పేర్కొన్నారు. ఖానాపురం హావేలి సీఐ జె. రామకృష్ణ, వన్ టౌన్ సీఐ ఎన్.చిట్టిబాబు, త్రీ టౌన్ సీఐ పి.సర్వయ్య, ఖమ్మం రూరల్ సీఐ మల్లంపల్లి శ్రీనివాసులను ఐజీపి కి రిపోర్ట్ చేయాలని పేర్కొన్నారు.

వీరి స్థానాల్లో ఖానాపురం హవేలీకి క్రైమ్ స్పెషల్ బ్రాంచ్ నిజామాబాద్ నుండి టి. శ్రీహరిని కేటాయించగా, వన్ టౌన్ కు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్పెషల్ బ్రాంచ్ సీఐగా విధులు నిర్వహించిన టి. స్వామి బదిలిలో రానున్నారు. అదేవిధంగా మూడో పట్టణం కు కొత్తగూడెం వన్ టౌన్ ట్రాఫిక్ లో పనిచేసిన బత్తుల సత్యనారాయణ, రూరల్ కు గతంలో ఖమ్మంలో టూ టౌన్ అర్బన్ పోలీస్ స్టేషన్లలో పనిచేసిన సీహెచ్. రాజిరెడ్డి లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.



Next Story

Most Viewed