- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
18న ఖమ్మం లో ట్రాఫిక్ ఆంక్షలు

దిశ, ఖమ్మం సిటీ : ఈ నెల 18న ఖమ్మం నగరంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పర్యటనలో భాగంగా ఖమ్మంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్టు పోలీస్ కమిషనర్ విష్ణు వారియార్ తెలిపారు. ఖమ్మంలో నిర్మించిన కొత్త కలెక్టరేట్ కార్యాలయ సముదాయాల ప్రారంభోత్సవం అనంతరం జరిగే భారత రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావ భారీ బహిరంగ సభ ఉన్నందున 18న ఉదయం 6 గంటల నుండి 2.30 గంటల వరకు ఖమ్మం వైపునకు వచ్చు సాధారణ, భారీ వాహనాల ట్రాఫిక్ ను క్రమబద్దీకరించుటలో భాగంగా ఈ కింద తెలిపిన రూట్లలో ఖమ్మం టౌన్ నుండి దారి మళ్లించినట్టు పేర్కొన్నారు. ఖమ్మం నగరం నుండి హైదరాబాద్ , వరంగల్ వైపు వెళ్లు వారు నాయుడు పేట, ఏదులాపురం వరంగల్ క్రాస్ రోడ్డు, మీదుగా మరిపెడ బంగ్లా-తోర్రురు-హైదరాబాద్/వరంగల్ వైపు వెళ్లాలని కోరారు. ఖమ్మం నగరం నుంచి విజయవాడ, వైరా రాజమండ్రి , సత్తుపల్లి వైపు వెళ్లు వాహనాలు వెంకటగిరి క్రాస్ రోడ్డు - కోదాడ- విజయవాడ హై వే వైపు వెళ్లాలని సూచించారు. ఇల్లందు వైపు వెళ్లు వాహనాలు రామన్నపేట, డోర్నకల్,మహబుబాబ్ వైపు, కోదాడ వైపునకు వెళ్లు వాహనాలు ముస్తఫనగర్ మీదుగా బోనకల్-చిల్లకల్లు వైపు వెళ్లాలని తెలిపారు. మహబూబాబాద్ వైపునకు వెళ్లు వారు నాయుడు పేట క్రాస్ రోడ్డు, ఏదులాపురం జంక్షన్, తిరుమలాయపాలెం మరిపెడ మీదుగా మహబూబాబాద్ వైపు వెళ్లాలని కోరారు. అనవసర ప్రయాణాలను చేయరాదని సూచించారు.